DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ప్లాంట్ రక్షణ చేతకాకుంటే గాజులు పంపుతాం వేసుకో, జనసేన ఎద్దేవా

*అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్ పై పరుచూరి ఘాటైన విమర్శలు*

*(DNS Report : Ganesh. BVS, Staff Reporter, Vizag)*

*విశాఖపట్నం, నవంబర్ 02,  2021 (డిఎన్ఎస్):* జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై అవాకులు, అసంబద్ధ వ్యాఖ్యలు చేస్తున్నారని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ పై అనకాపల్లి  జనసేన పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ పరుచూరి

భాస్కర్ రావు మండిపడ్డారు. మంగళవారం విశాఖలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో అయన మాట్లాడుతూ అమర్ ప్రెస్ మీట్ కు ఘాటైన విమర్శలతో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. 

విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రయివేటీకరణ కాకుండా పరిరక్షణ చేసే శక్తి అధికార వైఎస్సార్ కాంగ్రెస్ కి చేతకాకపోతే చెప్పాలని, చేతికి గాజులు, చీర కట్టుకోండి

పంపిస్తున్నామని భాస్కర్ రావు ప్రకటించారు. పవన్ కళ్యాణ్ పై వ్యాఖ్యలు చేసే స్థాయి నీది కాదని ఎమ్మెల్యే పై ఘాటుగా విమర్శలు చేశారు 

కార్పొరేటర్ స్థాయి నుండి ఎమ్మెల్యే స్థాయికి వెళ్లిన అమర్నాథ్, అదే స్థాయి లో వసూళ్లు కూడా చేస్తున్నారన్నారు. అతని కంపెనీ విశాఖ జిల్లా లోని అనకాపల్లి నియోజవర్గం కసింకోటలో

చేసే కబ్జాలు, స్టోన్ క్రషర్స్ దగ్గర మీ వాళ్ళు చేసే డబ్బులు వసూళ్లు ఏ స్థాయిలో ఉన్నాయో తమకు తెలుసునని విమర్శించారు

జనసేన సభకు వచ్చిన జనాన్ని చూసి వైసిపి నేతలు‌ ఓర్చుకోలేకపోతున్నారని, వారికి వణుకు పుట్టిందన్నారు. 

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పై వెంటనే స్పందించినది జనసేనే నని,  కేంద్ర హోమ్

మంత్రిని కలిసి ఉక్కును ప్రైవేటీకరించవద్దని  పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్ లు విజ్ఞప్తి చేశారన్నారు.  ఉక్కు కర్మాగారానికి మినహాయింపు ఇవ్వాలని స్పష్టంగా కోరారని కూడా తెలిపారు.

అమర్ నాధ్ కి పిచ్చి పట్టింది వెంటనే ప్రెస్ మీట్ పెట్టి దుమ్మెత్తి పోస్తే మంత్రి పదవి వస్తుందని ఆశపడుతున్నారు. అనకాపల్లిలో

ఎమ్మెల్యేగా గెలిపించకపోతే ఇక భవిష్యత్తు వుండదని ప్రాధేయపడి గెలిచావని ఎద్దేవా చేసారు. 

అనకాపల్లిని అందాల పల్లిగా చేస్తానన్నారు అమర్. గెలిచాక కోటి రూపాయల పనులైనా అనకాపల్లిలో మొదలు పెట్టారా అని అడిగారు. అత్యధిక లాభాలతో నడుస్తోన్న కంపెనీ అమర్ కంపెనీ కి రాబడే తప్ప, పెట్టుబడి లేదన్నారు.  ప్రభుత్వ

స్ధలాలను కుమ్మక్కై కొట్టేస్తున్నారని మండిపడ్డారు. అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసి ఢిల్లీకి తీసుకు వెళ్లడానికి అడ్డంకి ఏంటి.

విజయసాయిరెడ్డి కార్పొరేషన్ ఎలక్షన్లకోసమే పాదయాత్ర చేశారని, వైసిపి ఎమ్పీలు ఒక్కసారైనా ఉక్కుపరిరక్షణకోసం ప్లకార్డులతో ప్రదర్శన చేశారా అని ప్రశ్నించారు. 

ఏపి

ప్రభుత్వానికి స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు ఉత్తరాలు రాసి ఒత్తిడి చేయాలని, పాచిమాటలు మాట్లాడుతున్న వైసిపినేతలు తమ నోటిని ఫినాయిల్ తో కడుక్కోవాలని, అలాంటి వాళ్ళకి ఫినాయిల్ పంపిస్తున్నామన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam