DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఈనెల 28 నుంచి ఐఆర్సీటీసీ చే 11 రోజుల గుజరాత్ యాత్ర

*(DNS Report : Ganesh. BVS, Staff Reporter, Vizag)*

*విశాఖపట్నం, నవంబర్ 03,  2021 (డిఎన్ఎస్):* ఇండియన్ రైల్వే క్యాటరింగ్ & టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ ( ఐఆర్సీటీసీ ) ఈ నెల 28 నుంచి వైబ్రంట్ గుజరాత్ పేరిట 11 రోజుల గుజరాత్ పర్యటనను నిర్వహిస్తున్నట్టు సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ రైలు విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుంచి ( విజయవాడ నుంచి

బయలుదేరుతుంది) ఈ నెల 28 న బయలు దేరి డిసెంబర్ 8 వ తేదీనాటికి (10 రాత్రులు/11 రోజులు) విశాఖ చేరుకుంటుంది. 
విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, పలాస స్టేషన్లలో ఈ రైలు ఆగుతుంది. 
ఈ రైలు లో 5 స్లీపర్ క్లాసు కోచ్ లు, 5 3 వ ఏసీ కోచ్ లు, 3 సాధారణ కోచ్ ఉంటాయి. ఈ రైలు లో స్లీపర్ టికెట్ రూ. 10 400 ఉండగా. . 3 వ  ఏసీ కోచ్ లో మనిషికి రూ. 17 330 గా ఉంది. ఈ

టికెట్ ధరలోనే  రవాణా, బస, భోజన తదితర  అన్ని ఏర్పాట్లు కలిపి నిర్ణయించారు. 
ఈ యాత్రలో  సోమనాథ్ - ద్వారక - నాగేశ్వర్  బెట్ ద్వారక, అహ్మదాబాద్ - అక్షరధామ్ ఆలయం- సబర్మతి ఆశ్రమం ప్రాంతాలను చూపించడం జరుగుతుంది. 

కొరోనా రక్షణ ఏర్పాట్లతో పాటు, ప్రతి కోచ్ లోనూ 8 బెర్ట్ లను ఖాళీ గా ఉంచి, ఎవరైనా అనారోగ్యం బారి

పడితే వైద్య సదుపాయం అందించనున్నారు.  

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam