DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మహా ప్రోక్షణలో అత్యంత వైభవం గా దివ్య ప్రబంధ పారాయణ 

తిరుమల, ఆగస్టు  6 , 2018 (DNS Online ): తిరుమల తిరుపతి దేవస్థానములు (à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿) ప్రధాన ఆలయం ఆనంద నిలయం లో à°ˆ నెల 9 నుంచి అత్యంత వైభవంగా నిర్వహించే అష్టబంధన à°¬à°¾à°²à°¾à°²à°¯ మహాప్రోక్షణ

నిర్వహిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ కార్యక్రమం లో నిర్వహించే ఆగమ సంప్రదాయ, వేద పారాయణలతో పాటుగా ద్రావిడ ఆగమ గ్రంథ పారాయణలు అత్యంత వైభవంగా అనుసంధానం

కానున్నాయి. వీటిల్లో ప్రధానమైనది నాలాయిర దివ్య ప్రబంధ పారాయణ. నాలాయిర దివ్యప్రబంధ సేవాకాలం  à°…నుసంధానం ( పారాయణ) చేసేందుకు అర్హులైన శ్రీవైష్ణవ భాగవతోత్తములు

పాల్గొనున్నారు. తిరుమల లో జరిగే అత్యంత అతి క్లిష్టమైన, అతి వైశిష్ట్యమైన మహా ప్రోక్షణలో ఈ ప్రబంధ పారాయణలు జరుగుతుండగానే ప్రోక్షణ కార్యక్రమం

కొనసాగిస్తుంటారు.  à°‡à°²à°¾ దివ్య ప్రబంధ పారాయణ చేస్తుంటే à°† తిరుమల గిరులు పులకించిపోతాయి అన్నది అక్షర సత్యం. 

నాలాయిర వైశిష్ట్యం... : 

 à°¶à±à°°à±€ వైష్ణవ

సంప్రదాయం లో అత్యంత వైశిష్ట్య మైన గ్రంధం నాలాయిర దివ్య ప్రబంధం. తమిళ భాషలో ఉండే ఈ ప్రబంధం లో 4000 కి పాశురాలు ( తమిళ శ్లోకాలు) ఉంటాయి. శ్రీవైష్ణవ సంప్రదాయం ఆచరించే

గృహాల్లోనూ, శ్రీవైష్ణవ ఆలయాల్లోనూ  à°…త్యంత పవిత్రమైన సమయాల్లో సంపూర్ణంగా పారాయణ చేయడం జరుగుతుంది. à°ˆ ప్రబంధం ఏ ఒక్కరో లేదా ఇద్దరో చదవడం అత్యంత కష్టం. పైగా

శతాబ్దాల కాలం క్రితం నమ్మాళ్వార్ ల ద్వారా రూపుదిద్దుకున్న ఈ ప్రబంధాన్ని గోష్టి గా ( అంటే బృందం ) పారాయణ చేయడం ఆనవాయితీ గా వస్తోంది. ఒక పంక్తి ( లైను ) ఒక బృందం,

రెండవ పంక్తి మరో బృందం పారాయణ చేస్తుంటారు. ప్రతీ విశిష్ట్యమైన రోజున à°ˆ ప్రబంధంలోని అత్యంత ప్రాధాన్యత కల్గిన నాల్గవ విభాగం  à°¤à°¿à°°à±à°µà°¾à°¯à°¿à°®à±Šà°à°¿ ని మాత్రం తప్పక

పారాయణ చేస్తుంటారు. ఇది ఒక వెయ్యి పాశురాలకు పైగా ఉంటుంది. ఇలాంటి విభాగాలు మొత్తం నాలుగు ఉంటాయి. వాటిని పారాయణ చెయ్యాలి అంటే సామాన్య విషయం మాత్రం కాదు అనేది

సంప్రదాయవాదులు అంగీకరించే విషయం. తిరుమల లాంటి ఆలయాల్లో సైతం ఈ నాలాయిర దివ్య ప్రబంధ పఠనం పూర్తిగా అనుసంధానం చేసే సందర్భాలు అతి తక్కువగా ఉంటాయి. ఆయా

విశిష్టతను బట్టి కొన్ని పాశురాలను మాత్రం చదవడం జరుగుతుంది. రాపత్తు, పగలు పత్తు సమయాల్లోనూ (అధ్యయనోత్సవాల్లో )  à°•à±Šà°¨à±à°¨à°¿à°‚à°Ÿà°¿à°•à°¿ మాత్రమే అనుసంధానం జరుగుతుంది.

వార్షిక బ్రహ్మోత్సవాల్లో స్వామి వాహన సేవల ముందు జీయర్ స్వాములు, వారి శిష్యులు బృందంగా నిర్వహించే గ్రంథ పఠనం లో కేవలం కొన్ని సమయాల్లో మాత్రమే అనుసంధానం

చేస్తుంటారు. ఈ మహా ప్రోక్షణ సమయంలో సంపూర్ణ నాలాయిర దివ్యప్రబంధ పఠనం పారాయణ జరుగుతుందని ఆలయ ఆగమ పండితులు తెలియచేస్తున్నారు.
 


#dns #dns news #dnsnews #dns media #dnsmedia #dnslive #dns live #visakhapatnam #vizag #vizag media #visakhapatnam media #ttd #nalayira divya

prabandham #parayana #nalayira divyaparabandham #srivaishana #sri vaishna

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam