DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కేదార్‌నాధ్‌లోని ఆది శంకరుల విగ్రహ శిల్పి అరుణ్ మైసూరు వాసి 

*(DNS Report : Sairam. CVS, Bureau Chief, Vizag)*

*విశాఖపట్నం, నవంబర్ 05,  2021 (డిఎన్ఎస్):* శుక్రవారం ఉదయం కేదార్‌నాధ్‌ దేవాలయ ప్రాంగణంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించిన ఆదిశంకరుల విగ్రహం రూపొందించిన శిల్పి అరుణ్ యోగిరాజ్. మైసురుకు చెందిన శిల్పి.  

ఈ విగ్రహం ఎత్తు 14 అడుగులు, 22 టన్నుల బరువు ఉన్న ఆ విగ్రహాన్ని

రోజుకు 15 గంటలు చొప్పున 9 మాసాలు కష్టపడి అద్భుత శిల్పంగా మలిచారు యోగిరాజ్.

కేదార్‌నాధ్‌ దేవాలయ సమగ్ర అభివృద్ధిలో భాగంగా ఆదిశంకరుల సమాధిని పునరుద్ధరణ చేసి, ఆయన విగ్రహాన్ని ప్రతిష్టించాలని నిర్ణయించారు. అందుకోసం పీఎంఓ లో ప్రత్యేక సెల్ ఏర్పాటైంది. 2020 సెప్టెంబరులో దేశవ్యాప్తంగా ఉన్న శిల్పుల నుంచి నమూనా

చిత్రాలను సేకరించగా, అందులో 8 మందిని ఫైనల్ చేసి వాటిని ప్రధానమంత్రి వద్దకు పంపింది పీఎంఓ.

ప్రధాని మోదీజీకి మైసూరుకు చెందిన 37 ఏళ్ళ అరుణ్ యోగిరాజ్ అనే శిల్పి పంపిన నమూనా అద్భుతంగా నచ్చింది. వెంటనే ఆయనను పిలిపించి మాట్లాడి పని ప్రారంభించమన్నారు. అంతేకాదు కొద్ది మార్పులతో మరింత అద్భుతంగా రూపొందించిందేకు

అవసరమైన మార్పులు చేర్పులూ చేసేందుకు కూడా మోదీ ఆయనకు స్వాతంత్ర్యం ఇచ్చారు.. 

అరుణ్ యోగిరాజ్ పనిలోకి దిగేటప్పటికి 2021 జనవరి వచ్చేసింది. శూన్యమాసం పోయిన తరువాత పని ప్రారంభించారు. మైసూరుకు 50 కి.మీ దూరంలోని హెచ్ డి కోట నుంచి కృష్ణ శిలను సేకరించారు. ఈ శిలతోనే హోయశాల దేవాలయంలోని శిల్పాలను చెక్కారు ఆనాటి

శిల్పులు. కేవలం 9 మాసాల్లో పనిపూర్తి చేశారు. ఇందుకై ఆయన రోజుకు 15 గంటలు కష్టపడ్డారు.
 
భగవంతుడు పెట్టే పరీక్షలు చాలా కఠినంగా ఉంటాయి. శిల్పం దాదాపు పూర్తై విగ్రహావిష్కరణ నవంబరు 5న అని ప్రకటించిన తరువాత నెల రోజుల ముందు ఆయన తండ్రి మరణించారు. అరుణ్ కేదార్‌నాధ్‌ నుంచి మైసూరుకు వచ్చి తండ్రి అంత్యక్రియలు జరపలేని

సంకట పరిస్థితి ఏర్పడింది. తన తాతగారైన బసవన్న శిల్పి గారు మనవడికి ధైర్యం చెప్పి తాను కొడుకు అంత్యక్రియలు నిర్వహించారు.. ఆయన మాత్రం అకుంఠిత దీక్షతో కేదార్‌లోనే ఉండి నవంబరు 2వ తేదీ నాటికి పనిపూర్తి చేసి దేవాలయ బోర్డుకు శిల్పాన్ని అప్పగించారు అరుణ్ యోగిరాజ్.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam