DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వేదవిద్యార్థులకు కూడా ప్రోత్సాహాన్ని అందించండి: యామిజాల

*(DNS Report : Sairam. CVS, Bureau Chief, Vizag)*

*విశాఖపట్నం, నవంబర్ 06,  2021 (డిఎన్ఎస్):* రాష్ట్రంలో వేదవిద్యను అభ్యసిస్తున్న వారికి కూడా అమ్మఒడి తరహా ప్రోత్సాహాన్ని అందించే విధంగా అవకాశం కల్పించమని రాష్ట్ర సభాపతి కోన రఘుపతిని కోరినట్టు ఆంద్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాఖ్య గౌరవ అధ్యక్షులు యామిజాల నరసింహ మూర్తి తెలిపారు. బాపట్లలో

ఆయన్ని తమ బృందం సభ్యులు కలిసి వేదవ్యాస స్కీం ని అమ్మఒడి పరిధిలోకి తీసుకువస్తే చాలామందికి ప్రోత్సాహంగా ఉంటుందని తెలిపామన్నారు. 

ఇదే విషయమై ప్రభుత్వానికి, మంత్రులకు, గవర్నర్ కు, పీఠాధిపతులు కి పలుమార్లు వినతి పత్రాలు అందించామన్నారు. 

అమరావతిలో  ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి,

విజయవాడలో దేవాదాయ శాఖామంత్రి  వెల్లంపల్లి శ్రీనివాస్ లను కూడా కలిసి ఈ విషయం వాళ్ళ దృష్టికి కూడా తీసుకువెళ్లడం జరిగిందన్నారు. 

ఈ బృందం లో యామిజాల తో పాటు పురాణం శేషు, నాగాభట్ల రవి శర్మ తదితరులు ఉన్నారు. 
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam