DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విశాఖ వాసులు రాజధానిని కోరుకోవడం లేదు: బి.వి.రామ్

*(DNS Report : Sairam. CVS, Bureau Chief, Vizag)*

*విశాఖపట్నం, నవంబర్ 06,  2021 (డిఎన్ఎస్):* విశాఖ వాసులు విశాఖపట్నంలో రాజధానిని కోరుకోవడం లేదని, అమరావతికే జై కొడుతున్నారని తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్ అన్నారు. విశాఖ పర్యటనలో ఉన్న భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ని శనివారం రామ్ కలుసుకున్నారు. ఆయనను కలిసిన  సందర్భంగా బివి రామ్  

మాట్లాడుతూ 
మరోవైపు  అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలంటూ రాజధాని ప్రాంత రైతులు సుదీర్ఘకాలంగా ఆందోళన చేస్తున్నారన్నారు. తాజాగా నాయస్థానం టు దేవస్థానం పాదయాత్రను ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని వివరించారు, అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరిని అవలంభిస్తోందని ఆరోపించారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో

శాంతి భద్రతల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. ప్రభుత్వ తీరును ఎవరు ప్రశ్నించినా వారిని రాష్ట్ర ప్రభుత్వం టార్గెట్ చేస్తోందని  ఆవేదన వ్యక్తం చేశారు. తాను స్వయంగా రాష్ట్ర హోంశాఖ మంత్రి      కలిసి వివరించిన ఇంతవరకు కనీస స్పందన లేదని  వాపోయారు. 

ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం దృష్టి సుందర విశాఖ నగరం పై

 పడిందని .. ఈ క్రమంలోనే కొందరు నాయకుల ప్రయోజనాల కోసం  కొండలను తొలగిస్తూ పర్యావరణానికి తీవ్ర హాని చేసేందుకు కూడా వెనుకాడటం లేదని రామ్ ఉపరాష్ట్రపతి కు తెలిపారు.

మరోవైపు  విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు మీ స్థాయి లో  ప్రయత్నాలను చేయవలసిందిగా తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్ ఉప రాష్ట్రపతిని

అభ్యర్థించారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam