DNS Media | Latest News, Breaking News And Update In Telugu

శబరీమలై యాత్ర కై విశాఖ ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజి సర్వీసులు 

*(DNS Report : Sairam. CVS, Bureau Chief, Vizag)*

*విశాఖపట్నం, నవంబర్ 09,  2021 (డిఎన్ఎస్):* కార్తీక మాసం లో శబరీ మల యాత్రకు వెళ్లే అయ్యప్ప స్వామి భక్తుల కోసం ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్టు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్ రవాణా సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ (విజయనగరం జోన్) సిహెచ్ రవికుమార్ తెలిపారు. మంగళవారం విశాఖ పట్నంలోని ద్వారకా

బస్ కాంప్లెక్స్ లో ని విఐపి లాంజ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో అయన మాట్లాడుతూ విశాఖపట్నం రీజియన్ ప్రయాణికులకు అందించే సేవలలో భాగంగా శబరిమలలో కొలువైయున్న శ్రీ శబరిగిరీశుని దర్శనార్ధం వెళ్ళు భక్తులకు 2003 వ సం. నుండి బస్సులను నడుపున్నామన్నారు. దానిలో భాగముగా ఈ 2021  సంవత్సరం లో కూడా శబరిమల వెళ్ళు భక్తుల కొరకు 5, 6, 7

రోజుల ప్రత్యేక ప్యాకేజీలు రూపొందించామన్నారు. అయ్యప్ప స్వాముల సేవలో విశేష అనుభవం కలిగిన సుశికుతులైన డ్రైవర్లతో సురక్షితమైన ప్రయాణం అందచేస్తూ విశాఖ జిల్లా నుండి కాక ఇతర రాష్ట్రాలైన ఒడిశా లోని నౌరంగపూర్, కోరాపుట్, జైపూర్ ప్రాంతాల వారు కూడా ఆకర్షితులయ్యేలా ఈ శబరిమల బస్సులను ఏ.పి.ఎస్.ఆర్.టి.సి. విశాఖ రీజియన్

పంపుచున్నట్టు తెలిపారు.  

ఈ సంవత్సరం కూడా స్వాముల కొరకు సూపర్ లగ్జరీ (2 x  2 వీడియో కోచ్), అల్ట్రా డీలక్స్ (2 x 2 వీడియో కోచ్) బస్సులను.. అందుబాటులో వుంచడం జరిగినదన్నారు. 

శబరిమల ప్యాకేజి వివరములు:

5 రోజుల యాత్ర లో దర్శించే క్షేత్రాలు : 
ఎగువ విజయవాడ, మేల్ మదత్తూరు, ఎరుమేలి, పంబ, సన్నిధానం,

దిగువ శ్రీపురం, తిరుపతి, శ్రీకాళహస్తి, అన్నవరం, క్షేత్రాలను దర్శించవచ్చన్నారు. 

దీనికై ఒక భక్తునికి టికెట్ ధర:  సూపర్ లగ్జరీ రూ.7050/- అల్ట్రా డీలక్స్ - రూ.7000/ ఇంద్ర AC రూ. 9150/- అమరావతి AC రూ .11500/ గా నిర్ణయించామన్నారు. 

6 రోజుల యాత్ర లో దర్శించే క్షేత్రాలు : 
ఎగువ కాణిపాకం, శ్రీపురం, భవాని పళని, ఎరుమేలి, పంబ,

సన్నిధానం, దిగువ తిరుపతి, శ్రీకాళహస్తి విజయవాడ, అన్నవరం క్షేత్రాలను దర్శించవచ్చన్నారు. 

దీనికై ఒక భక్తునికి టికెట్ ధర: సూపర్ లగ్జరీ కోసం - రూ.7450 /- అల్ట్రా డీలక్స్ కోసం రూ.7400/- ,  ఇంద్ర AC కోసం రూ.9650/- అమరావతి AC కోసం  రూ.12150/ - .

7 రోజుల యాత్ర లో దర్శించే క్షేత్రాలు : 
(1) ఎగువ కాణిపాకం, శ్రీపురం, భవాని, పళని,

ఎరుమేలి, పంబ,  సన్నిధానం, దిగువ మదురై రామేశ్వరం, తిరుపతి, విజయవాడ, అన్నవరం క్షేత్రాలను దర్శించవచ్చన్నారు. 

దీనికై ఒక భక్తునికి టికెట్ ధర:  సూపర్ లగ్జర్ కోసం  రూ.8050 /- అల్ట్రా డీలక్స్ కోసం  రూ.8000/ ఇంద్ర AC కోసం -రూ.10400/- అమరావతి AC కోసం  రూ.13150 /- .

శబరీ మల యాత్రకు వెళ్లే భక్తుల సౌకర్యార్ధం విశాఖపట్నం లోని

ద్వారకా బస్సు కాంప్లెక్స్ లోని దుకాణ సముదాయం లోని షాప్ నెంబర్ 4 లో ప్రత్యేక టికెట్ కౌంటర్ ను ప్రారంభించారు. వివరాలకు  7382914116 , 7382917436 ఫోన్ నెంబర్లను సంప్రదించవచ్చన్నారు. ఈ సేవలను యాత్రకు వెళ్లే భక్తులు వినియోగించుకోవాల్సిందిగా సూచించారు. 

ఈ విలేకరుల సమావేశంలో విశాఖపట్నం ప్రాంతీయ మేనేజర్ ఏ. అప్పల రాజు,

 డిప్యూటీ చీఫ్ మెకానికల్ ఇంజనీర్ ( అర్బన్) బి. అప్పలనాయుడు, డీసీటీఎం ( రూరల్ ) కె వెంకట రావు,  డీసీటీఎం ( అర్బన్ ) కె. పద్మావతి,  డిప్యూటీ సిఎంఈ ( రూరల్ ) అప్పల నారాయణ, డిప్యూటీ సి టీ ఎం ( కమర్షియల్ ) జి. సత్యనారాయణ, డిపో మేనేజర్ డి. ఢిల్లేశ్వర రావు, ఏ టీ ఎం, ద్వారకా బస్ కాంప్లెక్స్,   విఎం మూర్తి,  అసిస్టెంట్ మేనేజర్ పి.

శ్రీనివాసరావు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.  

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam