DNS Media | Latest News, Breaking News And Update In Telugu

గిరిజనుల్లో చైతన్యానికి ఏజెన్సీ సంతల్లో కళాజాత ప్రదర్శన

*(DNS Report : Sairam. CVS, Bureau Chief, Vizag)*

*విశాఖపట్నం, నవంబర్ 09,  2021 (డిఎన్ఎస్):* గంజాయి సాగును ఏజెన్సీ ప్రాంతం నుండి నిర్మూలించాలనే ఉద్దేశంతో విశాఖ రురల్ ఎస్పీ బి. కృష్ణారావు చేపట్టిన అవగాహనా సదస్సులను కళాజాతాల రూపంలో ఏజెన్సీ ప్రాంతాల్లో విస్తృతంగా నిర్వహిస్తున్నారు. 

విశాఖ జిల్లాలోని జి.మాడుగుల, సంతబయిలు మరియు

భీరం గ్రామాల్లో ఈరోజు జరుగుతున్న సంతకు వచ్చిన గిరిజనుల ఉద్దేశించి కళాజాత బృందం పాటలు, స్కీట్ల ద్వారా అవగాహన, చైతన్యం కల్పించారు.

జి.మాడుగుల మండలం లో జరుగుతున్న సంతలకు వచ్చిన గిరిజనులు ఉద్దేశించి జిల్లా పోలీసులు, ఎస్.ఈ.బి ఇతర శాఖల సమన్వయంతో జిల్లా ఎస్పీ బి. కృష్ణారావు ఆదేశాల మేరకు పరివర్తన కార్యక్రమంలో

భాగంగా గంజాయి సాగును ఏజెన్సీ ప్రాంతం నుండి నిర్మూలించాలనే ఉద్దేశంతో కళాజాత బృందలతో పాటలు, స్కిట్ల ద్వారా అవగాహన కల్పించి, గంజాయి వలన జరిగే అనర్ధాలు తెలియజేసి, గంజాయి సాగు, అక్రమ రవాణాను గిరిజనులు వదిలి  సాంప్రదాయ పంటలు, వాణిజ్య పంటలు వేసుకోవాలని , యువత చట్టవ్యతిరేక  కార్యక్రమాల్లో పాల్గొనరాదని చైతన్య

పరిచారు.

ఈ కార్యక్రమంలో ఎస్సై జి.మాడుగుల  ఏ.శ్రీనివాసరావు సిబ్బంది పాల్గొన్నారు. 
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam