DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పద్మ పురస్కార సభలో భారతీయ పవిత్రత వెల్లువిరిసిన వేళ

పావుకోళ్ళు విడిచి పురస్కారం అందుకున్న ఉడిపి పీఠాధిపతులు

*(DNS Report : Sairam. CVS, Bureau Chief, Vizag)*

*విశాఖపట్నం, నవంబర్ 11,  2021 (డిఎన్ఎస్):* భారత ప్రభుత్వం సమాజ శ్రేయస్సులో విశేష కృషి చేసిన వారికి పద్మ పురస్కారాలను అందించి సముచిత రీతిలో గౌరవించడం ఆనవాయితీగా వస్తోంది. అదే విధంగా గత ఏడాది 2020 లో ప్రకటించిన పురస్కార

గ్రహీతలకు ఇటీవలే భారత రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ అవార్డులను అందించారు. దీనిలో అత్యంత సామాన్యులకు పెద్ద పీటవేసి, యావత్ ప్రపంచానికి భారతీయ వాభావాన్ని తెలియచేసారు. దీనిలో ఎంపికైన వారిలో అత్యంత సామాన్యుల నుంచి, ధార్మిక సంస్థలు, పీఠాధిపతులు సైతం ఉన్నారు. వీరిలో పద్మ విభూషణ్ పురస్కారానికి కర్ణాటక కు చెందిన ఉడిపి

పెజావర్ ఆధ్యాత్మిక సంస్థానం పీఠాధిపతులు విశ్వేశ తీర్ధ్ స్వామి కి అందించాలని భారత ప్రభుత్వం ప్రకటించింది. వారు ఇటీవలే పరమపదించడం తో ఈ పురస్కారాన్ని వారి ఉత్తరాధికారి విశ్వ ప్రసన్న తీర్ధ స్వామి ని స్వీకరించవలసిందిగా సభకు ఆహ్వానించారు. 
సన్యాసులు కావడంతో స్వామిజి పావుకోళ్ళను ధరించి సభకు వచ్చారు. అయితే. . భారత

రాష్ట్రపతి నుంచి అవార్డు ను తీసుకునే సమయంలో పావుకోళ్ళను విడిచి పెట్టి, పురస్కారాన్ని అందుకోవడం తో ఒక్కసారిగా సభ ప్రాంగణం చప్పట్లతో మారుమ్రోగిపోయింది. 

సాధారణంగా పీఠాధిపతులు కొన్ని సంప్రదాయాలకు అతీతులు అయినప్పడికి. .  భారత దేశాధిపతి, అత్యున్నత సభలో దేశానికి సంబంధించిన పురస్కారం సర్వ శ్రేష్టమైనదని,

తమ పూర్వ పీఠాధిపతులు లభించిన గౌరవం కావడంతో స్వామిజి పాదరక్షలు విడిచి పురస్కారం స్వీకరించినట్టు తెలుస్తోంది. 

సనాతన హైందవ సంప్రదాయంలో దేశాధినేతలకు ఇచ్చే గౌరవంగా తెలుస్తోంది. 
ఇదే సభలో మరింకెందరో మహనీయులు పాదరక్షలు లేకుండానే పురస్కారాన్ని అందుకోవడం గమనార్హం. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam