DNS Media | Latest News, Breaking News And Update In Telugu

తిరుమల శ్రీవారి సన్నిధిలో హోమ్ మంత్రి అమిత్‌షా 

*(DNS Report : Sairam. CVS, Bureau Chief, Vizag)*

*విశాఖపట్నం, నవంబర్ 13,  2021 (డిఎన్ఎస్):* మూడు రోజుల పర్యటన కోసం కేంద్ర హోంశాఖా మంత్రి అమిత్‌షా తిరుపతికి శనివారం వచ్చారు. సాయంత్రం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అమిత్ షా తో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్  రెడ్డి, ఇతరులు శ్రీనివాసుని దర్శించుకున్నారు. అనంతరం టిటిడి

వేదపండితులు రంగనాయకుల మండపంలో ఆశీర్వచనం చేసారు. చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఈఓ జవహర్ రెడ్డి లు శ్రీవారి లడ్డు ప్రసాదం, స్వామి వారి చిత్రపటం అందించారు.  

అంతకు ముందు రేణిగుంట విమానాశ్రయంలో హోమ్ మంత్రి కి ముఖ్యమంత్రి, టిటిడి చైర్మన్, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు, రాష్ట్ర అధికార

ప్రతినిధి జె. భానుప్రకాష్ రెడ్డి,  ఇతర మంత్రులు ఘనస్వాగతం పలికారు. 

మూడు రోజుల పాటు తిరుపతిలో జరుగనున్న సదరన్ జోనల్ సీఎంల భేటీలో పాల్గొనేందుకు అమిత్‌షా ఏపీకి వచ్చారు. ఈ నెల 14న ఉదయం నెల్లూరులో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నిర్వహిస్తున్న కార్యక్రమంలో షా పాల్గొననున్నారు.  అదే రోజు మధ్యాహ్నం తిరుపతిలో

సదరన్ జోనల్ సీఎంల భేటీలో పాల్గొననున్నారు. ఈనెల 15న శ్రీవారి దర్శనం అనంతరం అమిత్‌షా తిరుగు ప్రయాణమవుతారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam