DNS Media | Latest News, Breaking News And Update In Telugu

డిసెంబర్ 3 నుంచి విశాఖ లో ఆర్గానిక్ ఉత్పత్తుల ప్రదర్శన

*(DNS Report : Sairam. CVS, Bureau Chief, Vizag)*

*విశాఖపట్నం, నవంబర్ 14,  2021 (డిఎన్ఎస్):* డిసెంబర్ 3, 4,  5 తేదీల్లో విశాఖపట్నంలోని ఎంవిపి కాలనీ ఎస్ రాజా గ్రౌండ్లో ద్వితీయ ఆర్గానిక్ మేళా నిర్వహించనున్నట్టు తెలుస్తోంది.  మూడు రోజుల పాటు జరిగే ఈ మేళాలో వందకు పైగా స్టాల్స్ను ఏర్పాటు అవుతున్నాయి. సేంద్రియ వ్యవసాయం చేసే రైతులతో పాటు

సేంద్రీయ ఆహార ఉత్పత్తుల కంపెనీలు, సేంద్రియ ఎరువుల సంస్థలు ఈ మేళాలో పాల్గొనున్నాయి. 
ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మేళా ఉంటుందని ప్రవేశం ఉచితం. మేళాలో భాగంగా 3 వ తేదీన సేంద్రియ రైతుల సదస్సు, నాలుగవ తేదీన మిద్దె తోట పెంపకం పై శిక్షణ, ఐదవ తేదీన ప్రకృతి పరంగా ఆరోగ్యాన్ని పరిరక్షించుకునే అంశంపై

 సదస్సు జరుగనున్నాయి. గత ఏడాది నిర్వహించిన ఆర్గానిక్ మేళాకు విశేష స్పందన లభించింది.  దాని ఫలితంగా విశాఖలో  ఆర్గానిక్ ఉత్పత్తుల గిరాకీ పెరిగిందని తెలుస్తోంది. సేంద్రీయ ఆహార ఉత్పత్తుల తో ప్రజలు  ఆరోగ్యాన్ని  కాపాడుకోవాలనే సంకల్పంతో ఈ మేళ నిర్వహిస్తున్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam