DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సింహగిరిపై అధిక రేటుకు అమ్మే కొబ్బరి వ్యాపారికి అక్షింతలు

*(DNS Report : Sairam. CVS, Bureau Chief, Vizag)*

*విశాఖపట్నం, నవంబర్ 14,  2021 (డిఎన్ఎస్):* సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ పరిసరాల్లో కొబ్బరి కాయను రూ. 40 కి అమ్ముతున్న వ్యాపారికి ఆలయ ఈఓ ఎంవి సూర్యకళ అక్షింతలు వేశారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా చేసేందుకు ఈఓ ఆలయ పరిసరాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. దీనిలో భాగంగా oka

సాధారణ భక్తురాలిగా కొబ్బరి కాయలు వ్యాపార దుకాణాలకు వెళ్లారు. అక్కడ కొబ్బరి కాయ రూ. 40 అని వ్రాసి ఉన్న పెద్ద బోర్డు ను చూసి, విస్తుపోయారు. అదే విషయం దుకాణం దారును ప్రశ్నిస్తే. . .నిర్లక్ష సమాధానం రావడంతో షాక్ తిన్నారు. 

 కొబ్బరి కాయను ఒక్కొక్కటి రూ. 12 లేదా 15  కు మాత్రమే అమ్మాలి అంటూ వ్యాపారులకు ఈఓ గతంలోనే

ఆదేశాలు జారీ చేసారు. అదే విధంగా దుకాణం బయట పెద్ద అక్షరాలతో బోర్డు లు కూడా ఏర్పాటు చేయించారు. దేవస్థానం పెట్టిన ఆ బోర్డు కనపడకుండా కొత్త బోర్డు పెట్టడం పై ఈమె మండిపడ్డారు. దుకాణం దారుకు అక్షింతలు వేశారు. తక్షణం ఆ కొత్త  బోర్డు ను స్వాధీనం చేసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించారు. వచ్చినది భక్తురాలు కాదు ఆలయానికి

ఉన్నత అధికారిణీ అని తెలియడంతో దుకాణందారుడు క్షమాణాపాన కోరాడు.  

ధరల పట్టిక బోర్డులు బయటకు తీయించి ధరల పట్టిక ప్రకారం దేవస్థానం పరిసరాల్లో సమస్యని అధిక ధరకు అమ్మి నట్లయితే లైసెన్సులు రద్దు చేస్తున్నట్లు చెప్పారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తిన సహించేదిలేదని దేవస్థానం భక్తుల కోసం అన్ని రకాల

సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam