DNS Media | Latest News, Breaking News And Update In Telugu

19 న ఇసుకకొండ గుడి పై కార్తీకపౌర్ణమి నాడు ప్రత్యేక వ్రతాలు 

*(DNS Report : Sairam. CVS, Bureau Chief, Vizag)*

*విశాఖపట్నం, నవంబర్ 16,  2021 (డిఎన్ఎస్):* విశాఖపట్నం లోని ప్రసిద్ధ ఇసుక కొండ 
 ( పౌర్ణమిగుడి ) పై వేంచేసి యున్న శ్రీ సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం ఆలయంలో ఈ నెల 19 న కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక సత్యన్నారాయణ వ్రతాలు నిర్వహిస్తున్నట్టు ఆలయ ఈఓ బండారు ప్రసాద్

తెలియచేసారు. 

తెల్లవారు ఝామున శ్రీ స్వామి వారికి నిత్య ప్రాత: కాల ఆరాధనలు ముగించి  ఉదయం 03:00 గంటల నుండి రాత్రి 10:00 గంటల వరకు కోవిడ్-19 నిభందనలు పాటిస్తూ భక్తులకు దర్శనం మరియు అంతరాలయము దర్శనములు అనుమతిస్తున్నట్టు తెలిపారు. 

శ్రీ స్వామి వారి క్షేత్రంలో ఉదయం 5:00 గంటలకు మొదటి బ్యాచ్,  ఉదయం 7:00 గంటల కు

రెండొవ బ్యాచ్,  ఉదయం 10:00 గంటలకు మూడో బ్యాచ్ లుగా  ప్రత్యేకవ్రతములు ( రూ. 1116/- ) జరిపించనున్నట్టు తెలిపారు. ఉదయం 8:30 గంటలకు రూ. 300/- వ్రతములు జరిపించబడతాయన్నారు. 
నిత్య పూజలు అన్ని రకముల సేవలను యదావిదిగా జరిపించబడుచున్నవి. పౌర్ణమి కి వచ్చే భక్తులు మాస్కు, గ్లోజులు ధరించిచవలెను తగిన జాగ్రత్తలు తీసుకోని సామజిక దూరం

పాటిస్తూ శ్రీస్వామివారిని యదావిధిగా దర్శించి తరించవలసినదిగా కోరుతున్నారు. ధ్వజసంభం పూజ చేయుచుకున్న భక్తులు ఉదయం 03:00 గం||లకు తప్పక హాజరుకావాలన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam