DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఈ నెల 20 వరకూ అరుణాచలం లోకి భక్తులకు ప్రవేశం లేదు

*19 న అరుణాచలంలో ఏకాంతంలోనే కృత్తికా దీపోత్సవం*

*(DNS Report : Arunachala Sharma., Arunachalam )*

*అరుణాచలం / విశాఖపట్నం, నవంబర్ 16,  2021 (డిఎన్ఎస్):* ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పవిత్ర ఆధ్యాత్మిక క్షేత్రం తమిళనాడు లోని తిరువణ్ణామలై అరుణగిరి శిఖరాలపై  కార్తీక పౌర్ణమి సందర్భంగా జరిగే అత్యంత వైభవంగా జరిగే కృత్తికా దీపోత్సవం కు

భక్తులకు అనుమతి లేదు. కొరోనా మహమ్మారి ని అదుపు చేసేందుకు తీసుకున్న నిబంధనల్లో భాగంగా ఈ నెల 17వ తేదీ నుంచి 20 వరకూ అన్నామలైయార్ ఆలయంలోకి భక్తులకు ప్రవేశాన్ని నిషేదించినట్టు ఆలయ అధికారులు ప్రకటించడం జరిగింది. గిరివలం కు కూడా అనుమతించడంలేదని, ఇతర గ్రామాలూ, జిల్లాలు, రాష్ట్రాల నుంచి అరుణాచలం కు భక్తులు రావద్దు అని

సూచిస్తున్నారు. ఈ నిషేధం ఈ నెల 17 వ తేదీ మధ్యాహ్నం 1 గంట నుంచి అమలులోకి వస్తున్నట్టు తెలిపారు.

అరుణాచలం లో నిషేధాజ్ఞలు కారణంగా ఈ నెల 17 నుంచి 21వ తేదీ వరకు రమణాశ్రమం పూర్తిగా మూసివేస్తున్నట్లు గా ప్రెసిడెంట్ ప్రకటించారు. గవర్నమెంట్ ఆదేశాల మేరకు ఐదు రోజులపాటు భగవాన్ రమణ మహర్షి ఆశ్రమం సంపూర్తిగా మూసివేసి

ఉంచుతారు. దీనికి అనుగుణంగా భక్తులు వారి యొక్క ప్రయాణాన్ని నిర్ణయించుకోవాలని కోరుతున్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam