DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సీఎం జగన్‌ తో కియా ఇండియా మేనేజ్‌మెంట్‌ భేటీ

*(DNS Report : P. Raja, బ్యూరో చీఫ్, అమరావతి)*  
 
*అమరావతి, నవంబర్ 16,  2021 (డిఎన్ఎస్):* సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కియా ఇండియా నూతన ఎండీ, సీఈవో టే–జిన్‌ పార్క్‌ మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కరోనా కష్టకాలంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం తరపున తమకు పూర్తి సహాయ

సహకారాలు అందించడంపై కియా ఇండియా మేనేజ్‌మెంట్‌ సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఏపీ ప్రభుత్వ సహకారం వల్లే తాము అనుకున్న ఉత్పత్తి సామర్ధ్యానికి మించి కార్లను తయారుచేసి, మార్కెటింగ్‌ చేయగలిగినట్లు కియా మేనేజ్‌మెంట్‌ టీం ముఖ్యమంత్రికి వివరించారు. 

ఏపీలో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం,

పారిశ్రామిక వర్గాలకు ఇస్తున్న ప్రోత్సాహకాలపై కియా ఇండియా టీంతో సీఎం జగన్‌ చర్చించారు. అనంతరం కియా ఇండియా నూతన ఎండీ, సీఈవో టే–జిన్‌ పార్‌ను న్మానించించిన సీఎం వారికి జ్ఞాపిక అందజేశారు. ఈ సమావేశంలో ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, కియా ఇండియా చీఫ్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ కబ్‌ డాంగ్‌ లీ, లీగల్,

కార్పొరేట్‌ ఎఫైర్స్‌ హెవోడీలు పాల్గొన్నారు

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam