DNS Media | Latest News, Breaking News And Update In Telugu

దీపావళిని తలపించిన అరుణగిరుల్లో కార్తీక దీపోత్సవం

*(DNS Report : Sairam. CVS, Bureau Chief, Vizag)*

*విశాఖపట్నం, నవంబర్ 19,  2021 (డిఎన్ఎస్):* కార్తీకమాసం విశిష్టత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారు. కార్తీకమాసంలో అరుణాచలం కార్తీక దీపోత్సవానికి ప్రత్యేక స్థానం ఉంటుంది. శుక్రవారం సాయంత్రం అరుణగిరులపై కార్తీక దీపోత్సవం వేడుకలను

పురస్కరించుకుని తిరువణ్ణామలై లోని వాడవాడలా దీపావళి బాణాసంచాలను కాల్చడంతో ఆకాశమంతా దేదీప్యమానంగా కాంతులు వెల్లివిరిసాయి. 

ఈ ఏడాది కార్తీక దీపం కార్యక్రమంలో ఓ వైపు వర్షం పడుతున్నా భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని తమ భక్తిని చాటుకున్నారు. మనసులో భక్తి ఉంటే మనిషిని ఏది ఆపలేదని భక్తులు ఋజువుచేశారు.

భక్తులు ఆశ్రమాలు, ఇల్లు, వసతి గృహాల మేడల పైకి ఎక్కి, గిరులపై కార్తీక దీపోత్సవాన్ని దర్శించుకుని, వీళ్ళ ప్రాంతాల్లో సైతం దీపాలను వెలిగించారు. తిరువణ్ణామలై మొత్తం దేదీప్యమానంగా దీప కాంతుల్లో వెలిగొందింది.  

19వ తేదీ అరుణాచలం కొండపై వెలిగించే కార్తీక దీపోత్సవాన్ని కూడా ఆలయ పూజారులు, వంశపారం పర్యంగా

వస్తున్న వంశీకులతో   కొద్దిమందితో మాత్రమే నిర్వహిస్తామన్నారు.  సాధారణంగా కార్తీక పౌర్ణమికి తిరువణ్ణామలై లో కార్తీకదీపాన్ని దర్శించి గిరి ప్రదక్షిణం చేయటానికి దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి సుమారు 20 లక్షల మంది ప్రజలు తిరువణ్ణామలైకి వస్తారు. అయితే కోవిద్ నిబంధనల నేపథ్యంలో ఈపాస్ లను విడుదల చేసారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam