DNS Media | Latest News, Breaking News And Update In Telugu

1008 పార్ధివ లింగాలకు కార్తీక మాస విశేష రుద్రాభిషేకం

*(DNS Report : Sairam. CVS, Bureau Chief, Vizag)*

*విశాఖపట్నం, నవంబర్ 22,  2021 (డిఎన్ఎస్):* కార్తీకమాసం మూడో సోమవారం పరమశివునికి చాలా ప్రీతీకరం దీనిని పురస్కరించుకొని భక్తులు భక్తి శ్రద్దలతో వేకువ జామున నుంచి భక్తి శ్రద్దలతో పరమ శివుని దర్శనానికి ఆలయాలకు చేరుకోవడం జరిగింది ఇందులో భాగంగా ఆరోవ వార్డు బక్కనపాలెం లో వెంచేసి యున్న శ్రీ

కాశీ అన్నపూర్ణ దేవి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారికి విశేషంగా వేకువ జామున నాలుగు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు స్వామి వారికి విశేషంగా పంచామృత అభిషేకలు,విశేష పూజలు తిరిగి సాయంత్రం 6 గంటల ఆకాశ దీపారాధన తధనంతరం సహస్ర లింగార్చన మరియు సహస్ర బిల్వార్చన కార్యక్రామాలను ఆలయ ప్రధాన అర్చుకులు గరిమెళ్ల

శ్రీకాంత్ శర్మ ఆధ్వర్యంలో ఉప అర్చకులు కర్రి రమణ మూర్తి శర్మ, మురపాక అనీల్ కుమార్ శర్మ  సహాయ సహకారాలతో నిర్వహించారు ఆలయ ప్రధాన అర్చకులు మాట్లాడుతూ పరమశివునికి కార్తీక మాసంలో వచ్చే మూడొవ వారం అత్యంత ప్రీతీకరంగా భక్తులు భావిస్తారు అదే విధంగా మన శాస్త్ర  పురాణం లో కూడా స్వామి త్రినేత్ర దారుడు, త్రీసూల దారుడు,

త్రిగునాత్మక స్వరూపుడు చెప్పబడ్డాయి ఈ విశేష పర్వదినం కారణంగా 1008 పార్ధివ లింగాలు (పుట్ట మన్ను తో తయారు చేసిన లింగాలు) వాటికి విశేషంగా భక్తులు స్వాహాస్తాలతో రుద్ర నమక, చమక,పారాయణంతో రుద్రాభిషేకం తధనంతరం 1008 బిల్వ దళాలతో స్వామి వారికీ సహస్ర బిల్వార్చన నిర్వహించినట్లు తెలిపారు భక్తులు ఉపవాసాలు ఉండి హర హర మహాదేవ శంభో

శంకర అంటూ స్మరించుకుని పునీతులు అయ్యారని అలాగే వచ్చే ఆఖరి సోమవారం తేదీ నవంబర్ 29 ని మధ్యాహ్నం 12 గంటలకు భక్తులు సహాయ సహకారంతో గొప్ప అన్న సమారాధన చేస్తున్నట్లు తెలిపారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam