DNS Media | Latest News, Breaking News And Update In Telugu

*అరకు కు అద్దాల కోచ్లున్న మరోరైలు వెంకయ్య చే ప్రారంభం*   

*(DNS Report : Sairam. CVS, Bureau Chief, Vizag)*

*విశాఖపట్నం, నవంబర్ 22,  2021 (డిఎన్ఎస్):* ఆధునిక LHB కోచ్ లు, 2విస్తాడోమ్ కోచ్ లతో  విశాఖ - కిరండూల్ - విశాఖ నూతన రైలును ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు సోమవారం ప్రారంభించారు. విశాఖ-అరకు-విశాఖ మధ్య రాకపోకలు సాగిస్తుంది. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ చారిత్రాత్మక సిటీలో గణనీయ ప్రగతి ని

నేడు చూస్తున్నానని, AU లో లా చదివినప్పటి నుండి నాకు విశాఖ తో అనుబంధం ఉందన్నారు. ఈ రైలు కోసం, విశాఖ రైల్వేస్టేషన్ అభివృద్ధి కోసం రైల్వే మంత్రితో మాట్లాడానని,  విశాఖ కు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కోరాననన్నారు.  విశాఖపట్నం బ్యూటీ, డ్యూటీ సిటీ అన్నారు. విశాఖ సహజ సిద్ధమైన అందాలకు నెలవు, ఒక ప్రక్క కొండలు, మరో ప్రక్క సముద్రం

ఉందన్నారు. ఇక్కడి వారు శాంతికాముకులు, సౌమ్యులు,అభివృద్ధి ని ప్రోత్సహించే వాళ్ళు అన్నారు. 
-న్యాయ విద్య అయిన వెంటనే 17 నెలలు ఇక్కడే జైలులో గడిపానని, ఇక్కడ వాతావరణం నన్ను రాజకీయాల్లోకి నడిపించిందన్నారు. ఇక్కడ జైలు నుండి వెళ్లి సరాసరి ఒంగోలు నుండి పోటీ చేసి రాజకీయాల్లోకి రావడం జరిగిందని తెలిపారు. నా రాజాకీయ

భవిష్యత్తు కి విశాఖ లొనే పునాది పడిందన్నారు. 

ప్రస్తుతం తానూ రాజకీయాలలో లేనని, ఇకపై రానని, దానిపై మాట్లాడనన్నారు. అసెంబ్లీ, పార్లమెంట్లు మంచి చర్చావేదిక లు కావాలని,  విద్య, పారిశ్రమక, పర్యాటక రంగాలకు ప్రోత్సాహం ఇవ్వాలన్నారు. 

ఇప్పటికే IIM, LAW యూనివర్సిటీ, పెట్రోలియం యూనివర్సిటీ వంటి

ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు విశాఖలో ఉన్నాయని, ప్రపంచ పర్యాటకులను విశాఖ విశేషంగా ఆకర్షిస్తోందన్నారు. ఈ పర్యాటకులకు మరిన్నీ మదురానుభూతులను ఈ అరకు రైలు అందిస్తుందని, ప్రత్యేకంగా విస్తాడోమ్ కోచ్ లో ప్రయాణం ఎంతో ఆనందాన్ని ఇస్తుందన్నారు.
గ్లాస్ టాప్ రూఫ్, 360డిగ్రీల కోణంలో తిరిగే సీట్లు, వ్యాలీ, గుహలు, పచ్చని కొండల

గుండా సాగే ప్రయాణంలో ప్రతీది ప్రత్యేకమేనన్నారు. 

కార్యక్రమంలో ఈస్ట్ కోస్ట్ GM అర్చన జోషి, ప్రజా ప్రతినిధులు, రైల్వే అధికారులు పాల్గొన్నారు.
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam