DNS Media | Latest News, Breaking News And Update In Telugu

బిల్లును రద్దు సరే, రైతుల ఆత్మాహుతుల సంగతేంటి?: తెలుగు శక్తి 

*జాతీయ మనవ హక్కుల సంఘాన్ని కలుస్తాం: బివిరామ్* 

*(DNS Report : Sairam CVS, Bureau Chief, Visakhapatnam)*

*విశాఖపట్నం, నవంబర్ 23, 2021 (డిఎన్ఎస్):* మూడు రాజధానుల వికెంద్రీకరణ బిల్లును రద్దు చేస్తే సరిపోదని, అమరావతి కోసం ప్రాణాలు అర్పించిన 179 మంది రైతుల కుటుంబాల సంగతేంటి అని తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్ ప్రభుత్వాన్ని డిమాండ్

చేసారు. మంగళవారం విజెఎఫ్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన 
మాట్లాడుతూ..  పాదయాత్ర చేస్తున్న రైతులను పెయిడ్ ఆర్టిస్టులంటూ అవమానించిన మంత్రులు తక్షణమే రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. అదే విధంగా అమరావతి కోసం ప్రాణాలు అర్పించిన 179 మంది రైతుల కుటుంబాలకు వైసీపీ ప్రభుత్వం 10

కోట్ల రూపాయలను నష్ట పరిహారంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. 
ఈ ఆత్మహతుల విషయమై త్వరలోనే జాతీయ మానవ హక్కుల సంఘాన్ని కలుస్తామన్నారు. ఇప్పడికే ఈ బిల్లు రద్దు, అంతకు ముందు ఉద్యమంలో జరిగిన ఘటనలను పూర్తి వివరాలను తెలియచేస్తూ జాతీయ మానవహక్కుల సంఘానికి ఫిర్యాదు చేసి, ప్రత్యక్షంగా కలిసేందుకు అనుమతి కోరడం

జరిగిందన్నారు. 

మంత్రులు, అధికార పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు పాదయాత్ర చేస్తున్న రైతులను పెయిడ్ ఆర్టిస్టులు అని చెప్పడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. కార్యక్రమం లో ఎం ఎల్ సీ దువ్వారపు రామారావు తదితరులు పాల్గొన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam