DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అమరావతి రైతుల మరణం పై బొత్స వ్యాఖలపై బి.వి.రామ్ మండిపాటు

*(DNS Report : Sairam CVS, Bureau Chief, Visakhapatnam)*

*విశాఖపట్నం, నవంబర్ 24, 2021 (డిఎన్ఎస్):* మన రాష్ట్ర రాజధానిగా అమరావతికి బదులుగా మూడు రాజధానులను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన తర్వాత.. ఒక్క రైతు కూడా మృతి చెందలేదని రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ చెబుతున్నారని..తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్ అన్నారు. మృతి చెందిన రైతులకు 10 కోట్ల

రూపాయల నష్టపరిహారం ఇప్పించాలని రామ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే బుధవారం విశాఖ లోని విమానాశ్రయంలో మంత్రి బొత్స సత్యనారాయణను కలిసి ఇదే ఈ విషయాన్ని ప్రస్తావించారు. అనంతరం  బొత్స స్పందిస్తూ  అమరావతి నే ఏకైక రాజధానిగా  కొనసాగించాలనే ఆవేదనతో  ఒక్క రైతు కూడా మరణించలేదని హేళనగా

సమాధానం ఇచ్చారన్నారు. ఈ పరిస్థితుల్లో  మృతి చెందిన 179 మంది రైతులకు చెందిన కుటుంబ సభ్యులు ఆ వివరాలను మంత్రి బొత్స సత్యనారాయణ దుష్టికి తీసుకు వెళ్లాలని సూచించారు. మరోవైపు  ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి స్వార్థ ప్రయోజనాల కోసం.. మూడు రాజధానుల బిల్లును ప్రవేశపెట్టి  ఆ తర్వాత రద్దు చేస్తున్నట్టు

ప్రకటించారన్నారు. ఆ బిల్లును రద్దు చేస్తున్నామని ప్రకటిస్తే సరిపోదని..  ఈ లోపుగా ప్రాణాలు కోల్పోయిన రైతుల కుటుంబాలకు న్యాయం చేయాలన్నారు. ఈ విషయమై  త్వరలో జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని రామ్ తెలిపారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా ఆంధ్ర ప్రదేశ్  ఏకైక రాజధానిగా అమరావతి నే కొనసాగించాలి అనే విషయం,

రైతుల కుటుంబాలకు న్యాయం చేసే విషయంలోనూ జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam