DNS Media | Latest News, Breaking News And Update In Telugu

తిరుపతి వరద బాధితులకు అండగా బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి 

*(DNS Report : Sairam CVS, Bureau Chief, Visakhapatnam)*

*విశాఖపట్నం, నవంబర్ 25, 2021 (డిఎన్ఎస్):* ఇటీవల చిత్తూరు, నెల్లూరు సహా ఇతర జిల్లాల్లో వరద ప్రభావంగా నష్టపోయిన ప్రజలకు అండగా నిలిచేందుకు భారతీయ జనతా పార్టీ నడుంబిగించినట్టు ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి జె. భానుప్రకాష్ రెడ్డి తెలిపారు. గత వారం రోజులుగా వివిధ ముంపు ప్రాంతాల్లో పర్యటించిన

అయన సర్వం కోల్పోయి నిరాశ్రయులుగా మిగిలిన వారికి తమ వంతు సహకారంగా నిత్యావసర వస్తువులు, వస్త్రాలు, కొంత నగదు పంపిణీ చేశారు. ముందుగా తిరుపతి పరిసర గ్రామాల్లో వరద ముంపు ప్రాంతాలను పరిశీలించామని తెలిపారు. 
వీరి సహాయం కోసం సహృదయులైన ప్రజల నుంచి విరాళాలను కూడా నగదు, వస్తు, సామాగ్రి, వస్త్రాల రూపంలో

సేకరిస్తున్నామన్నారు. తమ పిలుపునకు స్పందించి రోజువారీ చిన్న వ్యాపారం చేసుకునే వారు సైతం మంచి మనసుతో సహకారాన్ని అందించారన్నారు.  ఇప్పడికే కొన్ని ప్రాంతాల్లో నిత్యావసరాలను పంపిణీ చేయడం జరిగిందన్నారు. 

జిల్లాలో భారీ వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన ప్రాంతాలను పరిశీలించేందుకు ఏర్పాటు చేసిన వరద నష్టం

అంచనా కమిటీ కన్వీనర్ & బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ సురేంద్ర రెడ్డి, కమిటీ సభ్యులతో కలిసి తిరుపతి నగరంలోని పూలవాని గుంట, కొరమీను గుంట, ఆటోనగర్ మరియు తనపల్లి రోడ్డు సమీపంలోని స్వర్ణముఖి నదిపై వరదల ప్రభావం వలన  తెగిపోయిన కాజ్ వేను మరియు అక్కడి రోడ్లను పరిశీలించామన్నారు.
ఈ సందర్భంగా అకాల వర్షాల కారణంగా

నష్టపోయిన ప్రాంతాలను తీవ్ర కష్టాలు ఎదుర్కొన్న ప్రజలను కలిసి వారి వద్ద వివరాలు సేకరించడం జరిగింది. వీటిని రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించి తద్వారా కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకువెళ్లడం జరుగుతుందన్నారు. 

భాను ప్రకాష్ రెడ్డి స్వయంగా జోలె పట్టి, ప్రతి వీధిలోనే పర్యటించారు. 
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam