DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఋషికొండ టిటిడి ఆలయంలో పాంచరాత్ర ఆగమాన్ని ప్రవేశపెట్టండి 

*టీటీడీ చైర్మన్, జేఈఓలకు, సింహగిరి అర్చకులు, విశాఖ ఎంపీ లేఖ*

*(DNS Report : Sairam CVS, Bureau Chief, Visakhapatnam)*

*విశాఖపట్నం, నవంబర్ 25, 2021 (డిఎన్ఎస్):* విశాఖ మహా నగరంలోని ఋషికొండ ప్రాంతంలో తిరుమల తిరుపతి దేవస్థానములు నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీపాంచరాత్ర ఆగమ విధానాన్ని ప్రవేశ పెట్టాలని సింహాచల దేవస్థానం

అర్చకులు, విశాఖపట్నం ఎంపీ లు టిటిడి కి లేఖలు వ్రాసారు. 
సాక్షాత్తు తిరుమల శ్రీనివాసుని ఉత్తరాంధ్ర జిల్లాల వారికి చేరువ చేసే క్రమంలో ఈ ప్రాంతంలో ఆలయం నిర్మించడం ఈ ప్రాంతవాసుల భాగ్యం గా అభివర్ణించారు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో అత్యంత ప్రాశస్త్యం కల్గిన సింహాచల క్షేత్రం లోని శ్రీవరాహ లక్ష్మి నృసింహ స్వామి

దేవస్థానం లోను, శ్రీ కూర్మం లోని కూర్మనాథ స్వామి క్షేత్రం, ఇతర అనుబంధ దత్తత 
ఆలయాల్లోనూ పాంచరాత్ర ఆగమ విధానమే ఆచరణలో ఉందని తెలిపారు. తద్వారా టిటిడి దేవస్థానంలో ఈ పాంచరాత్ర ఆగమాన్ని ప్రవేశపెట్టినట్టయితే భవిష్యత్ లో జరిగే అన్ని ఉత్సవాలు, వేడుకల్లో స్థానికంగా ఉన్న ఆగమ పండితులు సంపూర్ణ సహకారం అందించే అవకాశం

ఉంటుందన్నారు. లేనిపక్షంలో టీటీడీ దేవాలయాలు, పరిధిలోని ఆధ్యాత్మిక కేంద్రాల నుంచి వైదిక సిబ్బంది రావడానికి, ఇతర ఏర్పాట్లకు కొంత వ్యయ ప్రయాసలతో కూడుకున్న కార్యక్రమం అవుతుందన్నారు. తద్వారా ఆర్ధిక వ్యయం పూర్తిగా తగ్గుతుందని తెలిపారు. 

ఈ మేరకు ఈ ప్రాంత వివరాలను తెలియచేస్తూ సింహాచల క్షేత్ర అర్చకులు టీటీడీ

చైర్మన్, టీటీడీ సంయుక్త కార్యనిర్వహణాధికారి, శ్రీపాంచరాత్ర ఆగమ సలహామండలి, విశాఖ ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లు, సింహాచల క్షేత్ర ఈఓ లకు లేఖ వ్రాసారు. 

దీనికి స్పందిస్తూ విశాఖ పట్నం లోక్ సభ సభ్యులు ఎంవివి సత్యనారాయణ టిటిడి చైర్మన్, జేఈఓ లకు లేఖ వ్రాసారు. 
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam