DNS Media | Latest News, Breaking News And Update In Telugu

డిసెంబర్ 3 న విశాఖ ఆర్గానిక్ మేళాకు నాబార్డ్ చైర్మన్ రాక  

*(DNS Report : Ganesh BVS, Staff Reporter, Vizag)*

*విశాఖపట్నం, నవంబర్ 27, 2021 (డిఎన్ఎస్):* డిసెంబర్ 3 వ తేదీన విశాఖపట్నంలో జరుగనున్న గో ఆధారిత ఉత్పత్తుల ప్రదర్శన మేళా ( ఆర్గానిక్ మేళా )కు జాతీయ వ్యవసాయ బ్యాంకు ( నాబార్డ్ ) చైర్మన్  చింతల గోవిందరాజులు ముఖ్య అతిథిగా హాజరవుతున్నట్టు మేళా సంధానకర్త జలగం కుమారస్వామి తెలిపారు. శనివారం విశాఖలో

 నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ మేళా సందర్భంగా సేంద్రియ వ్యవసాయం చేస్తున్న రైతులకు, సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్న స్వచ్ఛంద సేవా సంస్థలకు, పాత్రికేయులకు, సైంటిస్టులకు అవార్డులు ఇవ్వనున్నట్టు తెలిపారు. చెప్పారు. 
రైతులు  భూమి సుపోషణతో ఆరోగ్యకరమైన రసాయనాలు లేని పంటలు పండించి

వినియోగదారులకు అందాలనే  లక్ష్యంతో సేంద్రియ రైతు మేళా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వందకు పైగా దుకాణాలతో కూడిన ఎగ్జిబిషన్లో ప్రకృతి పంటలు వేసిన రైతులు వాటిని మార్కెటింగ్ చేస్తున్న సంస్థలు, ఎన్జీవోలు పాల్గొంటున్నారని తెలిపారు. ఉదయం  9 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఉంటుందని ప్రవేశం ఉచితమని వివరించారు. పెద్ద

ఎత్తున మేళాను  సందర్శించి రసాయనాలు లేని ఆరోగ్యాన్నిచ్చే పంటలను ప్రోత్సహించాలిసిందిగా విజ్ఞప్తి చేశారు. 

డిసెంబర్ 3 నుంచి మూడు రోజుల పాటు విశాఖలోని ఎంవీపీ కాలనీ లో గల ఏఎస్ రాజా మైదానం లో జరిగే ఈ మేళాలో రెండోరోజు జరుగనున్న మిద్దె తోట సదస్సు కు మిద్దె తోట నిపుణుడు తుమ్మేటి రఘోత్తమ రెడ్డి, మూడవ రోజు

జరుగనున్న నా ఆరోగ్యం సదస్సుకు ప్రకృతి వైద్య నిపుణులు  డాక్టర్ రవి వర్మ హాజరవుతున్నారు. 

ఈ విలేకరుల సమావేశంలో గోదారి ప్రకృతి వ్యవసాయ దారుల సంఘం అధ్యక్షులు బిహెచ్ రామకృష్ణంరాజు, జిల్లా అధ్యక్షుడు ఎం సత్యనారాయణ, విశాఖ ఆర్గానిక్ మేళ కమిటీ చైర్మన్ పి ఎల్ ఎం రాజు , కార్యదర్శి యం యుగంధర్ రెడ్డి, సహ

కార్యదర్శులు జె.వి రత్నం, ఉష, జిఎస్ఎన్ రాజు తదితరులు పాల్గొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam