DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వైఎస్ జగన్ పరిపాలన అట్టర్ ఫ్లాప్ :మాజీ ఎంపీ ఉండవల్లి

*(DNS Report : Sairam CVS, Bureau Chief, Vizag)*

*విశాఖపట్నం, నవంబర్ 27, 2021 (డిఎన్ఎస్):* ఒక్క ఛాన్స్ అని అడిగి మరీ అధికారంలోకి వచ్చిన ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరిపాలనలో ఘోర వైఫల్యం చెందారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఘాటుగా విమర్శించారు. రెండున్నరేళ్ల వైఎస్ జగన్ పరిపాలనపై అయన  రాజమహేంద్రవరంలో విలేకరుల

సమావేశం నిర్వహించారు. అసెంబ్లీలో ప్రతిపక్షం లేకపోతే ప్రజాస్వామ్యం లేనట్లే నన్నారు. ప్రభుత్వానికి అప్పులపై నియంత్రణ లోపించిందని ఆయన ఆక్షేపించారు. ఇప్పడికే వైకాపా ప్రభుత్వం రూ.3లక్షల కోట్ల అప్పులు చేసిందన్నారు. మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్యలో జగన్ ప్రమేయం ఉందని తానూ భావించడం లేదన్నారు. అయితే సిబిఐ విచారణలో ఉన్న

ఒక మర్డర్ కేసును విలువైన శాసన సభలో చర్చించవలసిన అవసరం ఏముందన్నారు. 

3 రాజధానుల బిల్లు ఉపసంహరించుకొని.. మళ్లీ పెడతాం అనడం ప్రభుత్వ వైఫల్యమేనన్నారు. ప్రతిపక్షం సలహాలు తీసుకుంటేనే ప్రభుత్వానికి పేరు వస్తుంది. చంద్రబాబునుద్దేశించి అగౌరవంగా మాట్లాడుతుంటే జగన్ ఏం చేస్తున్నారు? ప్రతిపక్షం లేకుండా

చేయాలనుకుంటే అంత అవివేకం ఇంకోటి లేదన్నారు.

ఇసుక, మద్యం, పెట్రోల్, కరెంట్.. ఇలా అన్ని ధరలు పెంచుకుంటూ పోయారు. అప్పులు పెరుగుతున్నాయి కానీ ఆస్తులు అసలేం. ఏర్పడటం లేదు. ఉన్నన్నాళ్లు అప్పులపై నెట్టుకొచ్చి ఆ తర్వాత రాష్ట్రాన్ని రోడ్డుపై పడేయడమే వైకాపా ఉద్దేశం లా కనపడుతోందన్నారు. అప్పులు కోసం ఎస్ఆర్ఆబీఎమ్

చట్టాన్ని ఇష్టారీతిన సవరించడం. దుర్మార్గం అన్నారు. అధికారులు సైతం ప్రస్తుత పరిస్థితి నిర్ఘాంత పోతున్నారన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam