DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఎందరికో స్ఫూర్తినిస్తున్న శ్రీవైష్ణవ గృహస్తుల హోమ శిక్షణ శిబిరం

*సంప్రదాయ పరిరక్షణకై యాజ్ఞీక పీఠం అవిశ్రాంత కృషి* 

*(DNS Report : Sairam CVS, Bureau Chief, Vizag)*

*విశాఖపట్నం, నవంబర్ 28, 2021 (డిఎన్ఎస్):* భగవద్రామానుజాచార్యులు ఈ ప్రపంచానికి అందించిన వైదిక సంప్రదాయాన్ని ప్రతి ఒక్క శ్రీవైష్ణవ సంప్రదాయపరులూ శాస్త్రోక్తంగా పాటించాలనే సంకల్పంతో భాగ్యనగరానికి చెందిన యాజ్ఞీకపీఠం చేస్తున్న

అవిశ్రాంత కృషి ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుంటూ లక్ష్యసాధన దిశగా సాగుతోంది. ఈ పీఠం ప్రధాన లక్ష్యం ప్రతి వైష్ణవ గృహస్తు. . తన జీవన ఉద్యోగాలను చేసుకుంటూనే వైదిక సంప్రదాయాన్ని కూడా యథాశక్తి ఆచరించుకోవాలి అని. దీనిలో భాగంగా ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడులకు చెందిన శ్రీవైష్ణవ

గృహస్తులకు అగ్ని ముఖం, విలక్షణ హోమ ప్రక్రియలను నేర్పించడం జరుగుతోంది. ఈ శిబిరం ఎందరికో స్ఫూర్తి నిస్తోంది. 

ఆశ్రమ నిర్వాహకులు పిటిజి కిషోర్ స్వామి ప్రత్యక్షంగా పర్యవేక్షణలో, స్వీయ శిక్షణలో ప్రతి రోజు రాత్రి 9 గంటల నుంచి 11 గంటల వరకూ సవివరణాత్మకంగా జరుగుతున్నా ఈ విలక్షణ హోమ ప్రక్రియను సుమారు 180 మంది

శ్రీవైష్ణవ సంప్రదాయ గృహస్తులు విద్యార్థులుగా చేరి, నేర్చుకుంటున్నారు. వీరిలో సామాన్య ఉద్యోగుల నుంచి, ఇంజనీర్లు, పాత్రికీయులు, వైద్యులు, అర్చకులు, ఉన్నతాధికారుల వరకూ ఎందరో వివిధ రంగాల్లో నిపుణులు, వివిధ వయసుల వారు కూడా ఉన్నారు.

జీవుడు పుట్టుక, మరణం, ఎలా సంభవిస్తాయి, పంచ భూతాల ప్రభావం, హోమ ప్రక్రియ వైభవం,

హోమం లో అగ్ని ప్రతిష్ట ఎలా చెయ్యాలి? హోమం ఆచరించవలసిన ఆవశ్యకత ఏంటి తదితర ప్రధాన అంశాలను సవివరణాత్మకంగా తెలియచేసారు.  

అసలు హోమగుండం లో అగ్ని రప్పించడం కోసం అగ్గి పుల్లను ఎందుకు వాడకూడదు అనే విషయంపై  సంపూర్ణ వివరణను అందించారు. సుమారు 15 రోజుల పాటు జరుగుతున్నా ఈ శిక్షణ లో భాగంగా డిసెంబర్ 5, 6, 7 తేదీల్లో 108

కుండలతో విశ్వ శాంతి  మహా యజ్ఞం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ యజ్ఞం లో పాల్గొనే ఋత్విక్ లు అందరూ ఈ 15 రోజుల విలక్షణ హోమ శిక్షణ శిబిరంలో శిక్షణ పొందిన విద్యార్థులే కావడం గమనార్హం. 

వివిధ కారణాల వల్ల చిన్న తనంలోనే ఆగమ సంప్రదాయ వైదిక విద్యను నేర్చుకోలేక పోయిన గృహస్తులకు, వారి చిరకాలవాంఛ తీర్చడం కోసం ఈ

శిబిరాన్ని ప్రత్యేకించి వివాహితులైన సంప్రదాయపరులకు నేర్పిస్తున్నట్టు అరిచార్యులు కిషోర్ స్వామి తెలియచేసారు. 

ఇప్పడికే ఈ యాజ్ఞీకపీఠం ద్వారా చిన్నపిల్లలకు, మహిళలకు సంప్రదాయ ఆరాధన, గ్రంధాలూ, భగవద్గిత, తిరుప్పావై తదితర అన్ని స్తోత్రాలను నేర్పించడం జరుగుతోందన్నారు. ప్రతి నెలా క్రమం తప్పకుండా సుదర్శన

హోమం, నిర్వహిస్తూనే ఉన్నట్టు తెలిపారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam