DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వరాహ నృసింహుని దర్శించి శ్రీవారి శ్రీచరణలకు..డాలర్ శేషాద్రి

*(DNS Report : Sairam CVS, Bureau Chief, Vizag)*

*విశాఖపట్నం, నవంబర్ 29, 2021 (డిఎన్ఎస్):* తిరుమల శ్రీనివాసుని సన్నిధిలో గత 42 ఏళ్లుగా అకుంఠిత దీక్షతో నిర్విరామ సేవలు అందించిన డాలర్ శేషాద్రి ( పాల శేషాద్రి )  సోమవారం విశాఖ లో పరమపదించారు. సోమవారం టిటిడి విశాఖ సాగర తీరంలో నిర్వహిస్తున్న కార్తీక దీపోత్సవం కార్యక్రమంలో పాల్గొనేందుకు

ఆదివారం ఆయన విశాఖ కు వచ్చారు. సాయంత్రం సింహాచల క్షేత్రానికి వచ్చి శ్రీవరాహ లక్ష్మి నృసింహ స్వామిని దర్శించుకున్నారు. తిరుమల క్షేత్రానికి వరాహ క్షేత్రం అని పేరు, ఆయనతో అనుబంధం ఉన్న తిరుమల శ్రీనివాసునికి సేవలు అందిస్తున్న శేషాద్రి సింహాచల వరాహుని దర్శించిన అనంతరం శ్రీనివాసుని శ్రీచరణలకు

చేరుకున్నారు. 

సోమవారం తెల్లవారుఝామున సమయంలో గుండె నొప్పి తీవ్రంగా రావడంతో ఆఖరి శ్వాస పీల్చినట్టు తెలుస్తోంది. సమీపంలోని ఓ కార్పొరేట్ ఆసుపత్రి కి తరలించే లోగానే మరణించినట్టు తెలిసింది. వైద్య పరీక్షల అనంతరం అంబులెన్స్ లో తిరుపతికి తరలించారు. 

అబ్దుల్ కలం ఎదుగుదలను ప్రత్యక్షంగా చూసిన

వ్యక్తి 

విశ్వ విఖ్యాతి గాంచిన శాస్త్రవేత్త, భారత మిసైల్ మాన్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఎదుగుదలను ప్రత్యక్షంగా చూసిన అతికొద్దిమందిలో డాలర్ శేషాద్రి ఒకరు. గతంలో ఒక  మీడియా కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో కలాం ఒక జూనియర్ శాస్త్రవేత్తగా తిరుమలకు వచ్చారని, అనంతరం సీనియర్ శాస్త్రవేత్తగాను, భారత అంతరిక్ష పరిశోధన

సంస్థ ( ఇస్రో) చైర్మన్ గానూ, తదుపరి భారత దేశ అత్యున్నత పదవి రాష్ట్రపతి హోదాలోనూ తిరుమల స్వామి వారి దర్శనానికి వచ్చారన్నారు. అన్ని సమయాల్లోనూ తాను తిరుమల శ్రీవారి సన్నిధిలో ఒకే హోదాలో సేవలు అందించినట్టు తెలిపారు. దాంతో తనను కలాం గుర్తించగలిగారని తెలియచేసారు.   

అందరు పీఠాధిపతులకూ ఆత్మీయులు.

దేశంలో ఉన్న వివిధ సంప్రదాయాలకు చెందిన పీఠాలు, పీఠాధిపతులతోనూ శేషాద్రికి ఆత్మీయ అనుబంధం ఉంది. భాగ్యనగరంలోని త్రిదండి చిన్న జీయర్ స్వామి, జీయర్ ఆశ్రమం, విశాఖ లోని శ్రీ శారదాపీఠం, ఉడిపి పీఠం, ఉత్తరాది పీఠాలు, కాశ్మీర్, ఉత్తర ప్రదేశ్, సహా అన్ని ప్రాంతాల వారితోనూ శేషాద్రికి సత్సంబంధాలు నెలకొని

ఉన్నాయి. 

వివిఐపి లు అందరితోనూ. . .  

తిరుమల శ్రీనివాసుని దర్శనానికి వచ్చే ప్రతి విశిష్ట వ్యక్తికీ స్వామి దర్శనం నుంచి ఆశీర్వచనం వరకూ దేవస్థానం ప్రోటోకాల్ ను పూర్తిగా పాటించే వ్యక్తిగా ( ఓ ఎస్ డి) గా పాల శేషాద్రికి పేరు ఉంది. 1977 లో టిటిడి లో చేరిన శేషాద్రి నాటి ప్రధాని ఇందిరా నుంచి భారత

రాష్ట్రపతులు, ప్రధాన మంత్రులు, సుప్రీం కోర్టు న్యాయమూర్తులు, గవర్నర్లు, ముఖ్యమంత్రులు, ఇతర దేశాధినేతలు, ప్రముఖులు, బడా వ్యాపారవేత్తలు, బడా వ్యాపారవేత్తలు, ఇతర ప్రముఖులు తిరుమలకు వచ్చిన సందర్భాల్లో తప్పక దర్శనమిచ్చే వారు శేషాద్రి. 

ఫోటోలంటే.  .అమితమైన అభిమానం. .

శేషాద్రి కి ఫోటోలు అంటే అమితమైన

అభిమానం, దాదాపుగా వ్యామోహం అనే చెప్పాలి. 1977 నుంచి నేటివరకూ తిరుమల స్వామి దర్శనానికి వచ్చిన ప్రతి ప్రముఖునితోనూ తానూ ఫోటో తీసుకున్నట్టు శేషాద్రి మీడియా కు తెలిపిన సందర్భాలు ఉన్నాయి. అత్యంత అరుదైన ఫోటోలు సైతం ఏ మీడియా వద్ద కూడా లభించని ఫోటోలు, తనవద్ద ఉన్నట్టు శేషాద్రి తెలియచేయడం గమనార్హం.  

ఇది మూడోసారి. .

.

తిరుమలలో శ్రీవారికి ప్రతి నిత్యం జరిగే సేవలన్నింటిలోనూ ప్రత్యక్షంగా పాల్గొని, సేవలు అందించే అతి కొద్దిమంది వైదిక సిబ్బంది లో పాల శేషాద్రి ఒకరు. గతంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్న సమయంలో హఠాత్తుగా గుండెనొప్పి రావడంతో శేషాద్రిని చెన్నై చికిత్స నిమిత్తం తరలించారు. అత్యంత క్లిష్ట పరిస్థితులను

సైతం ధీటుగా ఎదుర్కొని తిరిగి శ్రీవారి సేవకు హాజరయ్యారు.  

శరీరం పాడవకుండా ఎంబాంబింగ్ :. ..

తిరుపతికి చెందిన శేషాద్రి వెంట కుటుంబ సభ్యులు లేకపోవడం, తిరుపతికి ఇబ్బంది లేకుండా తరలించడం కోసం భౌతిక దేహం పాడుకాకుండా ఎంబాంబింగ్ ప్రక్రియను ఆంధ్ర మెడికల్ కళాశాల లో నిర్వహించినట్టు కళాశాల ప్రిన్సిపాల్

 డాక్టర్ పివి సుధాకర్ తెలిపారు. ఈ ప్రక్రియను డా. రవీంద్ర కిశోర్ నేతృత్వంలో అనాటమి విభాగంలో పూర్తి చేశారు. దీనికి రెండు గంటలు సమయం పట్టింది. ఆరోగ్య పరిస్థితుల్లో గుండెపోటు వచ్చినందువల్ల శేషాద్రి పార్థివ దేహానికి కోవిడ్  నిబంధనలు వర్తించవని తెలిపారు. పార్థివ దేహం ప్రయాణానికి తగ్గట్టు ఏర్పాటు చేసామని

తెలిపారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam