DNS Media | Latest News, Breaking News And Update In Telugu

తిరుమల ప్రయాణం వారం వాయిదా వేసుకోండి: టీటీడీ 

*(DNS Report : P Raja, Bureau Chief, Amaravati)*

*అమరావతి, డిసెంబర్ 01, 2021 (డిఎన్ఎస్):*  ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా కొండచెరియలు విరిగి పడడంతో తిరుమల రెండవ ఘాట్ రోడ్డు తాత్కాలికంగా మూసి వేశారు. దీంతో ఒక ఘాట్ రోడ్డు లోనే వాహనాల రాకపోకలను కొనసాగిస్తున్నారు. దీంతో తిరుమల దర్శనం టికెట్లు పొందిన భక్తులు తమ ప్రయాణాన్ని ఒక వారం

పాటు వాయిదా వేసుకోవాల్సిందిగా తిరుమల తిరుపతి దేవస్థానముల ట్రస్ట్ బోర్డు సూచన మేరకు చైర్మన్ వై వి సుబ్బారెడ్డి ప్రకటన చేసారు. దర్శన టిక్కెట్లు రీ షేడ్యూల్ చేసుకునే వెసులుబాటును త్వరలోనే కల్పిస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం కొండచరియలు తొలగించే పనిలో టీటీడీ విజిలెన్స్,ఇంజనీరింగ్,అటవిశాఖధికారులు అన్నారు. 
/> బుధవారం కొండా చర్యిలు విరిగి పడడంతో ఓ ఆర్టీసీ బస్సుకు తృటిలో ప్రమాదం తప్పింది. భారీగా ట్రాఫిక్ జామ్ అవ్వడంతో భక్తులు ఇబ్బంది పడుతున్నారు. 

20 సంవత్సరాలలో ఎన్నడు లేని విధంగా తిరుమలలో గత 15 రోజులుగా వర్షాలు కురిసాయని.. కొండ చరియలు విరిగిపడడంతో నాలుగు ప్రాంతాలలో రోడ్డు పూర్తిగా ధ్వంసం అయ్యాయని ఆయన

వెల్లడించారు. కొండ చరియలు విరిగిపడే ప్రాంతాలను గుర్తించేందుకు డిల్లి నుంచి ఐఐటి నిపుణులును రప్పిస్తూన్నామని స్ఫష్టం చేశారు. ఇటు వంటి ఘటనలు పునరావృతం కాకూండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే రెండో ఘాట్ రోడ్డులో మరమత్తు పనులుకు సమయం పట్టే అవకాశం వుందన్నారు. ప్రస్తుతం మొదటి ఘాట్ రోడ్డులోనే వాహన రాకపోకలుకు

అనుమతిస్తామని వెల్లడించారు టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam