DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ప్యాంటు, చొక్కతోనే సింహగిరి హోమంలో సమిధలు వెయ్యవచ్చా?

*అప్పన్న ఆలయంలో ధన్వంతరి హోమంలో అడ్డుకోని అర్చకులు*

*(DNS Report : Sairam CVS, Bureau Chief, Vizag)*

*విశాఖపట్నం, డిసెంబర్ 02, 2021 (డిఎన్ఎస్):* ఉత్తరాంధ్ర జిల్లా ఇలవేల్పుగా కొనియాడబడుతున్న ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం సింహాచలంలో గురువారం రాష్ట్ర ప్రజల ఆరోగ్యం సిద్ధి కోసం ధన్వంతరి హోమం

అత్యంత శాస్త్రోక్తంగా నిర్వహించారు  అర్చకులు ఆగమోక్తంగా అత్యంత శ్రద్దగా నిర్వహించిన ఈ హోమ ప్రక్రియలో ఆలయ ట్రస్టీ ఒకరు ప్యాంటు, చొక్కా ధరించి కార్యక్రమం లో పాల్గొన్నారు. అర్చకులు ఆసనం నుంచి లేవగానే. .వీరు కూడా ఒక సమిధను హోమ కుండంలో వెయ్యడం జరిగింది. వైదిక ప్రక్రియల్లో పాల్గొనేవారు కేవలం పంచె, కండువా మాత్రమే

ధరించాలి. దీనిపై భక్తులు మండిపడుతున్నారు. 

అయితే గురువారం సింహాచలం మండపంలో జరిగిన కార్యక్రమంలో అర్చకులతో పాటు, ట్రస్టీలు పాల్గొనడం గమనార్హం. దీనిలో ఎటువంటి దోషం లేదు, అయితే వారి వస్త్రధారణే అభ్యంతరంగా ఉంది. అర్చకులు పూర్ణాహుతి జరిపిన అనంతరం హోమ కుండంలో ఎటువంటి ద్రవ్యాలు వెయ్యరాదు. ఈ కనీస నియమాన్ని

అర్చకులు సైతం అడ్డుకోకపోవడం గమనార్హం. 
ఈ హోమ కార్యక్రమం లో ఆలయ సిబ్బంది, భక్తులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రైవేట్ కార్యక్రమాల్లో హోమ కుండం వద్ద ఎలా పాల్గొన్నా, పెద్దగా అభ్యంతరం ఉండకపోవచ్చు, అయితే శ్రీపాంచరాత్ర ఆగమ విధానంలో నిర్వహించబడుతున్న శ్రీ వరాహ లక్షి నృసింహ క్షేత్రంలో అపచారాలు జరిగితే భక్తులు

తప్పని సరిగా ప్రశ్నించే అవకాశం ఉంటుంది. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam