DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విఐపిలు కూడా మాస్క్ ధరించకపోవడం భాద్యతారాహిత్యం కాదా?

*(DNS Report : Ganesh BVS, Staff Reporter, Vizag)*

*విశాఖపట్నం, డిసెంబర్ 03, 2021 (డిఎన్ఎస్):* విశాఖ నగరం లో కొరోనా ప్రభావం అస్సలు లేదా అనే విధంగానే ఉంది సమాజంలో బాధ్యతాయుతమైన హోదాల్లో ఉన్నవాళ్లు, ప్రముఖుల తీరు. గత రెండేళ్లుగా ముఖానికి మాస్క్ లేకుండా ఇంటి గడప దాటిరావద్దు అని ప్రపంచమంతా మొత్తుకుంటుంటే.. విశాఖ మహా నగరంలో ప్రముఖులు మాత్రం

ఎక్కడ ముఖానికి  మాస్క్ లు ధరించకుండానే భారీ జన సమూహంలో ఇష్టానుసారంగా పాల్గొంటున్నారు. పైగా వీళ్ళని చూసి వీరి అనుచరులు కూడా ఎక్కడా ముఖమాస్క్ లు పెట్టుకోవడం లేదు. ఈ బాధ్యతారాహిత్యంగా తీరులో అధికార పార్టీ కి చెందిన రాష్ట్ర మంత్రులు, చట్ట సభల్లో ఉన్నత పదవుల్లో ఉన్నవారు, ప్రతిపక్షాలలో ఒక హోదా లో ఉన్నవారు, మాజీ ఐపీఎస్

లు కూడా ఉండడం గమనార్హం. 

గత రెండేళ్లుగా ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్ వైరస్ ప్రభావం ఇంకా తగ్గక ముందే మరో రకం వైరస్ ( ఓమ్రి కాన్ ) అడుగుపెట్టేసింది. ఇప్పడికే కోవిడ్ రక్షిత టీకా రెండు డోసు లు వేయించుకున్న సరే ముఖానికి మాస్క్ లు తప్పనిసరిగా ధరించాలి అంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ, భారత ప్రభుత్వం గట్టిగా

హెచ్చరిస్తున్నప్పడికి వీరు ఖాతరు చేస్తున్నట్టు గా కనపడడం లేదు. 

పొరుగు రాష్ట్రమైన తెలంగాణాలో ముఖమాస్క్ లేకుండా రోడ్డు పైకి వచ్చే వారికి రూ. 1000 ఫైన్ వేస్తామని అక్కడి ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసింది. మరి ఆంధ్ర ప్రదేశ్ లో ఇలాంటి ఆదేశాలు జారీచేసేవారే మాస్క్ లు పెట్టుకోకుండా తిరుగుతూ ఉంటె. . చట్టాలు

చెయ్యడానికి అర్హత ఉంటుందా అనే ప్రశ్న ప్రజల నుంచి వస్తోంది.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam