DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కేంద్ర పథకాల పేర్లు మార్చ కూడదు: ఏపీ కి స్మృతి ఇరానీ షాక్

*విశాఖపట్నం, డిసెంబర్ 04, 2021 (డిఎన్ఎస్):* కేంద్ర ప్రభుత్వ పథకాల పేర్లను రాష్ట్రాలు తమకు నచ్చినట్టు మార్చడం కుదరదని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ స్పష్టం చేసారు. కేంద్ర పథకాలకు ఆంధ్ర ప్రదేశ్ లో జగనన్న గోరుముద్ద, జగనన్న పాలు, వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ పేర్లు పెట్టడంపై కేంద్ర ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. 2021-22 ఆర్థిక

సంవత్సరంలో ఐసీడీఎస్‌, ఐసీపీఎస్‌ పథకాలకు కేంద్రం కేటాయించిన రూ.187 కోట్లకు లెక్కలు చూపాలని రాష్ట్రాన్ని ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వ పథకాల పేర్లను మార్చడంపై స్మృతి ఇరానీకి నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఫిర్యాదు చేయగా.. ఈమేరకు కేంద్ర మంత్రి స్పందించారు. కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం పేర్లు

మార్చడం కుదరదని స్పష్టం చేసిన కేంద్ర మంత్రి.. కేంద్ర పథకాలకు సీఎం జగన్‌ పేర్లు పెట్టడంపై నివేదిక కోరారు. రఘురామకృష్ణరాజు రాసిన లేఖకు సమాధానం చెప్పాలని ఏపీ ప్రభుత్వానికి లేఖ రాసినట్టు కేంద్రమంత్రి పేర్కొన్నారు. పథకాల పేర్లు మార్పు, ఆ విషయంలో తీసుకున్న చర్యలపై నివేదిక పంపాలని ఆదేశించినట్టు ఎంపీ రఘురామకు రాసిన

లేఖలో కేంద్ర మంత్రి వివరించారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam