DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఓమీక్రాన్ నివారణకై  54 హోమ కుండాలతో విశ్వశాంతి యజ్ఞం

*యాజ్ఞీక పీఠం లో 6 న ధన్వంతరి, 7 న ధాన్యలక్ష్మి హోమం* 

*(DNS Report : Sairam CVS, Bureau Chief, Vizag)*

*విశాఖపట్నం/ భాగ్యనగరం, డిసెంబర్ 05, 2021 (డిఎన్ఎస్):* సమాజంలోని ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని, ఈ నెల 6, 7 తేదీల్లో రెండు రోజుల పాటు 54 హోమ కుండలాలతో విశ్వశాంతి మహాయజ్ఞం నిర్వహిస్తున్నట్టు భాగ్యనారానికి చెందిన యాజ్ఞీకపీఠం

వ్యవస్థాపక ఆచార్యులు పిటిజి కిషోర్ స్వామి తెలియచేసారు. 

గత రెండేళ్లుగా ప్రపంచాన్ని వణికిస్తున్న కొరోనా వైరస్, నేడు కొత్తగా వెలుగు చూస్తున్న ఓమీక్రాన్ విష క్రిమి నివారణ కోసం భాగ్యనగరానికి చెందిన యాజ్ఞీకపీఠం ఈ నెల 6 వ తేదీ సోమవారం అత్యంత శాస్త్రోక్తంగా 54 హోమకుండలతో ధన్వంతరి హోమం, 7 వ తేదీ మంగళవారం యావత్

రైతాంగం సుఖసంతోషాలతో ఉండాలని 54 హోమ కుండలాలతో ధాన్యలక్ష్మి హోమం చేస్తున్నట్టు వివరించారు. 
సమాజ శ్రేయస్సే ధ్యేయంగా 108 మంది శ్రీవైష్ణవ సంప్రదాయ స్వాములతో ఈ హోమాలను నిర్వహింప చేస్తున్నామన్నారు. దీనికై సుమారు 200 మంది శ్రీవైష్ణవ గృహస్తులకు రెండువారాల పాటు ప్రత్యేక విలక్షణ హోమ శిక్షణ అందించడం జరిగిందన్నారు.

పూర్తి కొరోనా నిబంధనలను పాటిస్తూ ఈ రెండు హోమాలను తమ వేదపాఠశాలలోనే నిర్వహిస్తున్నామన్నారు. 

యాజ్ఞీకపీఠం పాఠశాల అవిశ్రాంత కృషి :. . .

భగవద్రామానుజాచార్యులు ఈ ప్రపంచానికి అందించిన వైదిక సంప్రదాయాన్ని ప్రతి ఒక్క శ్రీవైష్ణవ సంప్రదాయపరులూ శాస్త్రోక్తంగా పాటించాలనే సంకల్పంతో భాగ్యనగరానికి

చెందిన యాజ్ఞీకపీఠం చేస్తున్న అవిశ్రాంత కృషి ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుంటూ లక్ష్యసాధన దిశగా సాగుతోంది. 

ఈ పీఠం ప్రధాన లక్ష్యం ప్రతి వైష్ణవ గృహస్తు. . తన జీవన ఉద్యోగాలను చేసుకుంటూనే వైదిక సంప్రదాయాన్ని కూడా యథాశక్తి ఆచరించుకోవాలి అని. దీనిలో భాగంగా ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాలైన

కర్ణాటక, తమిళనాడులకు చెందిన శ్రీవైష్ణవ గృహస్తులకు అగ్ని ముఖం, విలక్షణ హోమ ప్రక్రియలను నేర్పించడం జరుగుతోంది. ఈ శిబిరం ఎందరికో స్ఫూర్తి నిస్తోంది. 

ఆశ్రమ నిర్వాహకులు పిటిజి కిషోర్ స్వామి ప్రత్యక్షంగా పర్యవేక్షణలో, స్వీయ శిక్షణలో ప్రతి రోజు రాత్రి 9 గంటల నుంచి 11 గంటల వరకూ సవివరణాత్మకంగా జరుగుతున్నా ఈ

విలక్షణ హోమ ప్రక్రియను సుమారు 200 మంది శ్రీవైష్ణవ సంప్రదాయ గృహస్తులు విద్యార్థులుగా చేరి, నేర్చుకుంటున్నారు. వీరిలో సామాన్య ఉద్యోగుల నుంచి, ఇంజనీర్లు, పాత్రికీయులు, వైద్యులు, అర్చకులు, ఉన్నతాధికారుల వరకూ ఎందరో వివిధ రంగాల్లో నిపుణులు, వివిధ వయసుల వారు కూడా ఉన్నారు.

ఇప్పడికే ఈ యాజ్ఞీకపీఠం ద్వారా

చిన్నపిల్లలకు, మహిళలకు సంప్రదాయ ఆరాధన, గ్రంధాలూ, భగవద్గిత, తిరుప్పావై తదితర అన్ని స్తోత్రాలను నేర్పించడం జరుగుతోందన్నారు. ప్రతి నెలా క్రమం తప్పకుండా సుదర్శన హోమం, నిర్వహిస్తూనే ఉన్నట్టు తెలిపారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam