DNS Media | Latest News, Breaking News And Update In Telugu

యాజ్ఞీక పీఠంలో వైభవంగా 54 కుండాత్మక విశ్వశాంతి యజ్ఞం మొదలు

*సమాజంకోసం ధన్వంతరి, రైతుల కోసం ధాన్యలక్ష్మి హోమం* 

*సమాజ కృతజ్ఞతగా వార్షికోత్సవ వేడుకలకు బదులుగా యజ్ఞం* 

*(DNS Report : Sairam CVS, Bureau Chief, Vizag)*

*విశాఖపట్నం /భాగ్యనగరం, డిసెంబర్ 06, 2021 (డిఎన్ఎస్):* భాగ్యనగరానికి చెందిన యాజ్ఞీకపీఠం వైదిక శిక్ష పీఠంలో, సంస్థ వ్యవస్థాపక ఆచార్యులు పిటిజి కిషోర్ స్వామి

నేతృత్వంలో ఒకేసారి ధన్వంతరి హోమం, రైతుల క్షేమం కోసం ధాన్యలక్ష్మి హోమం సోమవారం అత్యంత వైభవంగా ప్రారంభించారు. రెండు రోజుల పాటు జరుగుతున్న ఈ యజ్ఞం లో 64 మంది సుశిక్షుతులైన శ్రీవైష్ణవ స్వాములు భక్తి శ్రద్దలతో పాల్గొన్నారు. మంగళవారం కూడా కొనసాగనుంది. సమాజంలోని ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని, రైతులకు పంటలు

విజయవంతంగా పండి, రైతాంగం యావత్తు ఆర్థిక, సుఖ సంతోషాలతో ఉండాలనే సంకల్పంతో రెండు రోజుల పాటు 54 హోమ కుండలాలతో విశ్వశాంతి మహాయజ్ఞం నిర్వహిస్తున్నట్టు ఆయన తెలియచేసారు. 

రెండు హోమాలు వేర్వేరుగా చెయ్యాలి అని ముందుగా ఏర్పాట్లు చేసుకున్నప్పడికి, రెండింటిని ఒకేసారి నిర్వహించాలని నిర్ణయించి, ఒకే వేదికపై, రెండు

సంకల్పాలతో వైభవంగా నిర్వహిస్తున్నారు. ఉదయం, సాయంత్రం, రెండు పూటలా రెండు రోజుల పాటు జరిగే ఈ విశ్వ శాంతి యజ్ఞం స్వీయ ద్రవ్యంతోనే నిర్వహిస్తున్నారు. 

సమాజ కృతజ్ఞతగా వార్షికోత్సవ యజ్ఞం. 

సంస్థ వార్షికోత్సవం ను పురస్కరించుకుని మానవాళికి తమ వంతు కృతజ్ఞతగా ఈ విశ్వ శాంతి యజ్ఞం నిర్వహిస్తున్నట్టు

కిషోర్ స్వామి తెలిపారు. తమ సంస్థ ద్వారా ఇప్పడికే వెలది మంది సంప్రదాయ పరులు ఎన్నో శ్రీవైష్ణవ వైదిక గ్రంధాలను అభ్యశించారని, వారందరూ దీనిలో పాల్గొన వలసి ఉన్నప్పడికి, ప్రస్తుతం కొరోనా మహమ్మారి కారణంగా, కేవలం ఋత్విక్ లకు మాత్రమే దీనిలో పాల్గొనేందుకు అనుమతి ఇవ్వడం జరిగిందన్నారు. ప్రత్యక్షంగా పాల్గొనలేని వారందరికీ ఈ

యజ్ఞ కార్యక్రమాన్ని జూమ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేశామన్నారు.   

ఓమీక్రాన్ విష క్రిమి నివారణ కోసం ధన్వంతరి హోమం, యావత్ రైతాంగం సుఖసంతోషాలతో ఉండాలని ధాన్యలక్ష్మి హోమం చేస్తున్నామన్నారు. ప్రస్తుతం తెలంగాణ ప్రాంతంలో మొదలైన ఈ యజ్ఞ ప్రక్రియను, త్వరలోనే ఆంధ్ర ప్రదేశ్ లోని ఉత్తరాంధ్ర ప్రాంతమైన

విశాఖనగరంలోనూ నిర్వహించనున్నామన్నారు. ఈ యజ్ఞ ప్రక్రియ కోసం సమాజ శ్రేయస్సే ధ్యేయంగా సుమారు 200 మంది శ్రీవైష్ణవ గృహస్తులకు రెండువారాల పాటు ప్రత్యేక విలక్షణ హోమ శిక్షణ అందించడం జరిగిందన్నారు. పూర్తి కొరోనా నిబంధనలను పాటిస్తూ ఈ రెండు హోమాలను తమ వేదపాఠశాలలోనే నిర్వహిస్తున్నామన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam