DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విద్యుత్ శాఖ నిర్లక్ష్యం... బాలుడి శరీరం కాలింది : బివి రామ్

*(DNS Report : Sairam CVS, Bureau Chief, Vizag)*

*విశాఖపట్నం, డిసెంబర్ 07, 2021 (డిఎన్ఎస్):* విద్యుత్ శాఖ నిర్లక్ష్యం వల్ల అక్కయ్యపాలెం లో డాబా పైన ఆడుకుంటున్న బాలుడు విద్యుత్ వైర్లు పట్టుకొని శరీరం కాలిపోయిందని మంగళవారం ఉదయం మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు నివాసంలో ఆయన దృష్టికి తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్ తీసుకెళ్లారు.

నిరుపేదలైన కుటుంబసభ్యులు ఆ బాలుడికి వైద్య చికిత్స చేయించే స్తోమత లేదు కాబట్టి ప్రభుత్వం ఆదుకోవాలని రామ్ కోరారు. మానవతా విలువలకే మచ్చ తెచ్చిన ఆ ఇంటి యజమాని రాత్రికిరాత్రే బాలుడు కుటుంబ సభ్యుల్ని ఆ ఇంటి నుంచి ఖాళీ చేయించారు. తక్షణమే ఆ ఇంటి యజమాని అరెస్ట్ చేయాలని కోరారు. విద్యుత్ శాఖ నుంచి మరియు ఆ ఇంటి యజమాని నుంచి

నష్టపరిహారం ఇప్పించాలని అలాగే మెరుగైన వైద్య చికిత్స కోసం ప్రభుత్వం ఆదుకోవాలని మంత్రిని రామ్ కోరారు.

జగన్ మామయ్య నన్ను ఆదుకోవాలని చరణ్ ముఖ్యమంత్రి అభ్యర్థించారు. మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు స్పందిస్తూ ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి ఆపరేషన్ ఖర్చులన్నీ వచ్చేలాగా చూస్తానని బాలుడు కుటుంబానికి హామీ

ఇచ్చారు. మంత్రిని కలిసిన వారిలో గాయపడిన బాలుడు వి.చరణ్ కుమార్, బాలుడి తల్లి అమల, జి. లక్ష్మీరాజ్యం, రత్నం తదితరులు పాల్గొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam