DNS Media | Latest News, Breaking News And Update In Telugu

16 నుంచి ధనుర్మాసం, 3 నుంచి అధ్యయనోత్సవాలు 

*(DNS Report : Sairam CVS, Bureau Chief, Vizag)*

*విశాఖపట్నం, డిసెంబర్ 13, 2021 (డిఎన్ఎస్):* శ్రీవైష్ణవ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైనది ధనుర్మాసము. ఈ నెల 16 నుంచి ప్రారంభమవుతున్న ఈ నెలరోజుల ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించేందుకు శ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామి వారి దేవస్థానం , సింహాచలం లో ఏర్పాట్లు చేస్తున్నారు. ధనుర్మాసము ఆరంభ సూచికగా ఈ నెల

16.12.2021  మధ్యాహ్నం గం॥12.18ని॥లకు అంకురారోపణ చేయడం జరుగుతుంది. ఈ కాలంలోనే వైకుంఠ ఏకాదశి పర్వదినోత్సవం నిర్వహించడం జరుగుతుంది. వైష్ణవ సంప్రదాయంలో నమ్మాళ్వార్లకు అత్యంత ప్రాధాన్యత ఉంది. ఈ సందర్భంగా వైష్ణవ దేవాలయాల్లో అధ్యయనోత్సవాలు వైభవంగా నిర్వహిస్తుంటారు. జనవరి 3 నుంచి 12 వరకూ పగల్ పత్తు ఉత్సవములు, తదుపరి తేది.13.01.2022

నుండి తేది. 23.01.2022 వరకు రాపత్తు ఉత్సవములు జరుపనున్నారు. పగల్ పత్తు సందర్భముగా ప్రతి రోజు ఉదయం దేవాలయంలోను, రాపత్తు లో సాయంత్రం వేళల్లో  శ్రీస్వామివారి తిరువీధి ఉత్సవములు జరుగుతాయి. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam