DNS Media | Latest News, Breaking News And Update In Telugu

తిరుమల ధార్మిక క్షేత్రం. . వ్యాపార, కార్మిక కేంద్రం కాదు

*అఖిల భారత శ్రీవైష్ణవ బ్రాహ్మణ సంక్షేమ సంఘం*

*(DNS Report : Sairam CVS, Bureau Chief, Vizag)*

*విశాఖపట్నం, డిసెంబర్ 26, 2021 (డిఎన్ఎస్):* నిధుల సమీకరణకు తిరుమల కేంద్రాన్ని బహిరంగంగా ఒక్క టికెట్ కోటి రూపాయలు పెట్టీ  విక్రయించడానికి తీవ్రంగా ఖండిస్తున్నట్టు  అఖిల భారత శ్రీవైష్ణవ బ్రాహ్మణ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి

యతిరాజుల బాల బాలాజీ  ఘాటుగా విమర్శించారు. ఆదివారం విశాఖ నగరానికి వచ్చిన ఆయన సింహాచలం లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. . తమ సంఘం ప్రభుత్వాలకు వ్యతిరేకం కాదని, కేవలం శ్రీవైష్ణవ దేవాలయాల నిర్వహణ కు భంగం కలగడం, ఆగమ సంప్రదాయాలకు. లోటు జరిగినా,  వైదిక ప్రక్రియలో లోపాలు జరిగినా తప్పని సరిగా

స్పందిస్తుందని తెలిపారు.

 తిరుమల లో శ్రీ వేంకటేశ్వర స్వామిని  సాధారణ భక్తులు సైతం అత్యంత ఆనందంగా. దర్శించుకోవాలని అనే సంకల్పంతో నే కృషి చేస్తున్నామన్నారు. ఇటీవలే  హిందూ దేవాలయాలను ప్రభుత్వ పరిధి నుంచి విముక్తి కల్గించాలి అంటూ. భాగ్యనగరం నుంచి తిరుపతి అలిపిరి వరకూ జరిగిన పాదయాత్ర లో సైతం

ప్రత్యక్షంగా. పాల్గొన్నామన్నారు.

ఏ మతం  పడితే  ఆ మతం వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడానికి టిటిడి కార్మిక సంస్థ కాదన్నారు. ఇది కేవలం హిందూ ధర్మ సంప్రదాయాన్ని పాటించే ధార్మిక కేంద్రం అన్నారు. అన్య మతస్తులని ఇంకా టీటీడీ లో ఎలా కొనసాగిస్తున్నారని ప్రశ్నించారు.

సెక్యులర్ గా వుండాల్సిన ప్రభుత్వాలు,

పాలకులు ఈ విధంగా హిందూ ధర్మక్షేత్రాలను, ఆలయాలను, మఠాలను, స్వాధీన పర్చుకోవడం వారి వారి ఎజెండాలను అమలు చేసుకొంటూ పాలకుల ఓటుబ్యాంకు రాజకీయాలకు వినియోగించుకోవడం పూర్తిగా చట్ట విరుద్ధం అన్నారు.

దేవుని పేరిట భక్తులు హుండీలో వేసే నిధులు, ముడుపులతో సిబ్బంది  , అధికారులు మేహర్బానీలు చేసుకోవడం క్షమించరాని

నేరం అన్నారు.

కార్యాలయాలుగా మార్చటం చట్ట విరుద్ధం. ఏ సమస్యలు లేకపోయినా ఆక్రమణాలు చేయడానికే ఆలయాలను ఆక్రమించుకోవటం, ఇ.వో.ను నిమయించడం న్యాయవిరుద్ధం.

తిరుమల శ్రీవారి ఆలయానికి సంబంధించి అన్ని అంశాలు పెద్ద జియ్యర్, చిన్న జియ్యర్ అనుమతులతో మాత్రమే చేయాలి. మిగిలిన సాంప్రదాయలకు సంబంధించిన ఆలయాలలో

ఆయా ఆలయాల అగమాల స్థానాధిపతులు, పీఠాధిపతులు, మఠాధిపతులు, అర్చకులదే తుది నిర్ణయం.

ఎటువంటి సమస్యలు లేకుపోయిన తిరుమల శ్రీవారి ఆలయంలో, ఇతర దేవాలయాలలో ఐ.ఏ.ఎస్.లు యితర ప్రభుత్వ అధికారులు తిష్టవేసుకుని కూర్చుని ఆలయాల సాంప్రదాయలను భష్టు పట్టిస్తూ, అర్చకులపై పెత్తనం చెలాయిస్తూ, దేవదేవుళ్ళను నిలబెట్టి

ప్రభుత్వాలు తమ ఎజెండాలకు పెట్టుబడిగా వాడుకుంటున్నాయి. భక్తులు దేవదేవుళ్ళకు యిచ్చిన ఆలయాలను చట్టవిరుద్ధంగా ఇతర రాజకీయ ప్రయోజనాలకు వాడుకొంటున్నాయి.

పిల్లల ఆసుపత్రి కట్టడం అనేది ప్రభుత్వ యోచన చాలా మంచిదే. అయితే అందుకు ప్రభుత్వ నిధులు ఖర్చు చేసుకోవాలి గాని ప్రభుత్వ ఎజెండాతో రాజకీయ ఉద్దేశ్యాలతో తిరుమల

నిధులను అలా మళ్లించడం ఎంతమాత్రము ధర్మసమ్మతము కాదు. ఉదయాస్తమాన ధర్శనాలను భక్తులకు పూర్తి ఉచితంగా ఇవ్వాల్సిందిపోయి అందుకోసం రూ.1 కోటీ, కోటిన్నర ధరలు నిర్ణయించడం ఎంతమాత్రము ధర్మసమ్మతం కాదన్నారు.

విలేకరుల సమావేశంలో అఖిల భారత శ్రీవైష్ణవ బ్రాహ్మణ సంఘం జాతీయ సంఘం కోశాధికారి ఆకలంకం పార్థ సారథి, విశ్వ హిందు

పరిషత్ విశాఖ జిల్లా ప్రతినిధులు పాల్గొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam