DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పంజాబ్ లో ప్రధాని మోదీ పర్యటనలో భద్రతా వైఫల్యం

*(DNS Report : P. Raja, Bureau Chief,  Amaravati )*

*అమరావతి, జనవరి 5, 2022 (డి ఎన్ ఎస్ ) :* చండీగఢ్‌: ప్రధానమంత్రి నరేంద్రమోదీకి పంజాబ్‌లో నిరసన సెగ తగిలింది. ఆందోళనకారులు రహదారిని నిర్బంధించడంతో ప్రధాని మోదీ 20 నిమిషాల పాటు ఫ్లైఓవర్‌పై చిక్కుకుపోయారు. ఫలితంగా మోదీ తన పర్యటన రద్దు చేసుకోవాల్సి వచ్చింది. దీనిపై కేంద్ర హోంశాఖ ఆగ్రహం

వ్యక్తం చేసింది. పంజాబ్‌ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ఇలా జరిగిందని మండిపడింది. అసలేం జరిగిందంటే..

హుస్సేనీవాలాలోని జాతీయ అమరవీరుల స్మారకాన్ని సందర్శించేందుకు ప్రధాని మోదీ నేడు భఠిండా చేరుకున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌ ద్వారా అమరవీరుల స్మారకం వద్దకు వెళ్లాల్సి ఉండగా వాతావరణం అనుకూలించలేదు.

దీంతో రోడ్డు మార్గంలో వెళ్లేందుకు అధికారులు నిర్ణయించారు. దీనిపై పంజాబ్‌ డీజీపీకి సమాచారమిచ్చారు. మోదీ ప్రయాణించే మార్గంలో భద్రతా ఏర్పాట్లకు సంబంధించిన పోలీసుల ధ్రువీకరణ తర్వాతే ప్రధాని కాన్వాయ్‌లో బయల్దేరారు. అయితే మార్గమధ్యంలో మోదీ కాన్వాయ్‌ ఓ ఫ్లైఓవర్‌ వద్దకు చేరుకునే సరికి అప్పటికే కొందరు

ఆందోళనకారులు రోడ్డును నిర్బంధించారు. దీంతో 15-20 నిమిషాల పాటు ప్రధాని ఫ్లైఓవర్‌పై చిక్కుకుపోవాల్సి వచ్చిందని కేంద్ర హోంశాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఆందోళన కారణంగా మోదీ తిరిగి భఠిండా విమానాశ్రయానికి వెళ్లిపోయినట్లు పేర్కొంది.

ఘటన నేపథ్యంలో పంజాబ్‌ ప్రభుత్వంపై హోంశాఖ సీరియస్‌ అయ్యింది. రాష్ట్ర

ప్రభుత్వ భద్రతా వైఫల్యం కారణంగానే మోదీ పర్యటనకు ఇబ్బందులు తలెత్తాయని దుయ్యబట్టింది. ప్రధాని పర్యటన గురించి ప్రభుత్వానికి ముందుగానే సమాచారం ఇచ్చినప్పటికీ భద్రతా ఏర్పాట్లు చేయలేదని ఆరోపించింది. రహదారి వెంట అదనపు బలగాలను మోహరించలేదని తెలిపింది. దీనిపై పంజాబ్‌ ప్రభుత్వం బాధ్యత వహించి, పూర్తి నివేదిక ఇవ్వాలని

ఆదేశించినట్లు హోంశాఖ వెల్లడించింది.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam