DNS Media | Latest News, Breaking News And Update In Telugu

*మామిడాడ రామాలయం పై తపాలా చంద్రిక విడుదల*

*(DNS Report : Sairam. CVS, Bureau Chief, Visakhapatnam)*

*విశాఖపట్నం, జనవరి 08, 2022 (డిఎన్ఎస్):* తూర్పుగోదావరి జిల్లాలో జి మామిడాడలో ప్రసిద్ధి చెందిన శ్రీ కోదండరామస్వామి వారిపై భారతప్రభుత్వం తపాలా శాఖ రూపోందించిన ప్రత్యేక తపాలా చంద్రికను విశాఖ శ్రీ శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి, విశాఖపట్నం పోస్టు మాష్టర్

జనరల్, డాక్టర్ ఎం.వెంకటేశ్వర్లు విడుదల చేసారు. 1889 సంవత్సరంలో ద్వారంపూడి సుబ్బిరెడ్డి, రామిరెడ్డి సోదరులు ఈ ఆలయ నిర్మాణానికి పూనుకున్నారు. చెక్క ప్రతిమల రూపంలో వీళ్ళు స్ధాపించిన సీతారాములను 1934లో పంచలోహ విగ్రహా రూపంలో స్ధాపించారు. ఆ తర్వాత 1948లో 160అడుగుల తూర్పు గోపురం,1956లో 200అడుగుల పశ్చిమ గోపురం నిర్మించారు. ఈ గాలి

గోపురాల పై అంతస్ధు నుండి చుట్టుపక్కల సుమారు పదిహేను కిలోమీటర్ల దూరాన్ని వీక్షించవచ్చు! అదే విధంగా 1975ద్వారంపూడి రామచంద్రరెడ్డి ఈ ఆలయంలో అద్దాల మందిరం నిర్మించారు. ఇటువంటి మందిరం ఈ రాష్ట్రంలో ఇక్కడ తప్ప ఇంకెక్కడా లేదు. ఎన్నో ప్రత్యేకతలు కలిగి ఉన్న ఈ ఆలయాన్ని భారతప్రభుత్వం గుర్తించి, ప్రత్యేక తపాలా చంద్రికను

శుక్రవారం సాయంత్రం శ్రీ కోదండరామస్వామి ఆలయ ప్రాంగణంలో విడుదల చేసారు. ఈ ప్రత్యేక తపాలా చంద్రికను స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి సారధ్యంలో విశాఖపట్నం పోస్టు మాష్టర్ జనరల్, డాక్టర్ ఎం.వెంకటేశ్వర్లు విడుదల చేశారు. అనంతరం దేవాలయంపై వెబ్సైట్, దేవాలయ చరిత్ర తెలిపే కరపత్రాన్ని విడుదల చేసారు.  
ఈ కార్యక్రమంలో

రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి చెల్లుబొయిన వేణు గోపాలకృష్ణ, కాకినాడ పార్లమెంటు సభ్యురాలు వంగా గీతా విశ్వనాథ్,అనపర్తి శాసనసభ్యులు సత్తి సూర్యనారాయణ రెడ్డి, దేవాదాయ వంశపారంపర్య ధర్మకర్త ద్వారంపూడి శ్రీరామ మురళీ కృష్ణ శ్రీనివాసరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam