DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పది లో శతశాతం ఫలితం కోసం జీవీఎంసీ ప్రణాళిక :హరినారాయణన్

విశాఖపట్నం, ఆగస్టు 7 , 2018 (DNS Online ):  à°ˆ విద్యా సంవత్సరం లో జరిగే పదవ తరగతి వార్షిక పరీక్షల్లో శతశాతం ఉత్తీర్ణతా ఫలితాలు ( 10 / 10 జిపిఎ) లభించేలా ప్రధానోపాధ్యాయులు కృషి

చెయ్యాలని గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) కమిషనర్ హరినారాయణన్ సూచించారు. మంగళవారం జీవీఎంసీ పరిధిలోని అన్ని ఉన్నత పాఠశాలల

ప్రధానోపాధ్యాయులతో సమావేశమై వారికి తగిన సూచనలు చేశారు. విద్యార్థుల పట్ల అభివృద్ధి పై శ్రద్ధ వహించాలని, ఈ విద్యా సంవత్సరం లో 10 / 10 జిపిఎ వచ్చే విధంగా అందరు

విద్యార్థుల పట్ల పర్యవేక్షణ జరిపి సంపూర్ణ కృషి చేయాలన్నారు. ప్రస్తుత పోటీ సమాజంలో పదవ తరగతి లో 10 / 10 జిపిఎ అనేది కనీస అర్హతగా మారిపోయిందని, విద్యార్థుల భవిషత్తు

దృష్ట్యా ప్రతి ఒక్క విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. ఇప్పడి నుంచే తర్ఫీదు ఇస్తే ఎటువంటి ఒత్తిడి లేకుండా విద్యార్థులు శ్రద్దగా

చదువుతారన్నారు. అడ్వాన్స్ డ్ ఫౌండేషన్ కోర్సుల్లో చేరే విద్యార్థుల సంఖ్యా పెంచాలన్నారు. 
  కేవలం పదవ తరగతి విద్యార్థుల పైనే కాకుండా  6 à°µ తరగతి నుంచి 9 వరకూ

ప్రత్యేక శ్రద్ధ వహించడం ద్వారా వారికి విద్యా విషయాలపై మంచి పునాది పడుతుందన్నారు. పాఠశాల నుంచి బయటకు వెళ్లే వారు మంచి క్రమ శిక్షణ తో, సంపూర్ణ పరిణతి చెంది మంచి

పౌరులుగా తయారు కావాలన్నదే తమ ఆశయం అన్నారు. దివ్యంగులను గుర్తించి, వారిలో ప్రతిభను మెరుగు పరచడానికి ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించాలని సూచించారు. ఆగస్టు 15

లోగా ప్రణాళిక, కార్యాచరణ రూపాయందించాలని తెలిపారు. à°ˆ కార్యక్రమం లో విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు. 

 

#dns #dnsnews #dns news #dnslive #dns live #dnsmedia #dns media #vizag #visakhapatnam #GVMC #greater visakhapatnam municipal corporation #municipal #schools #10th class 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam