DNS Media | Latest News, Breaking News And Update In Telugu

బాక్సైట్‌ జోలికొస్తే ఖబడ్దార్‌... : సీపీఎం హెచ్చరిక 

#dns #dnsnews #dns news 
href="https://www.facebook.com/hashtag/dnslive?source=feed_text">#dnslive #dns live #dnsmedia #dns media #vizag #visakhapatnam #CPM #Communist party #visakhapatnam agency #bauxite #mining #bauxite mining #Visakha Agency bauxite 
href="https://www.facebook.com/hashtag/10th?source=feed_text">#Parliament #GO 97

">

విశాఖపట్నం, ఆగస్టు 7 , 2018 (DNS Online ):  à°•à±‡à°‚ద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజనుల మనోభావాలను గౌరవిస్తామని చెబుతూనే విశాఖ ఏజెన్సీలో బాక్సైట్‌ త్రవ్వకాల కోసం కొత్త నాటకాలకు

తెరలేపుతున్నాయని భారత కమ్యూనిస్ట్ పార్టీ ( మార్క్సిస్టు) జిల్లా కార్యదర్శి లోకనాధం  à°®à°‚డిపడ్డారు. మంగళవారం నగరం లోని జిల్లా కార్యాలయం లో అయన మాట్లాడుతూ

విశాఖ ఏజన్సీ లోని బాక్సైట్‌ జోలికొస్తే ఖబడ్దార్‌ అని హెచ్చరించారు. విశాఖ జిల్లా జర్రెలో బ్లాక్‌`1, బ్లాక్‌`2, బ్లాక్‌`3 పాటు గూడెంలో వున్న బాక్సైట్‌ గనులను

తవ్వేందుకు అనుమతించాలని నాల్కో సంస్థ 2017 మే నెలలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు దరఖాస్తు చేసుకుందని కేంద్ర గనుల శాఖా సహాయ మంత్రి హరిబాయ్‌ పార్టీబాయ్‌ చౌదరి

రాజ్యసభలో నిన్న తెలియజేశారన్నారు.  à°¦à±€à°¨à°¿à°¨à°¿ సిపిఎం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు. కేంద్రంలోని బిజెపి, రాష్ట్రంలోని టిడిపి కు నిజంగా చిత్తశుద్ధి

వుంటే గిరిజనుల మనోభావాల మీద గౌరవం వుంటే  à°¬à°¾à°•à±à°¸à±ˆà°Ÿà±‌ తవ్వకాలకు విడుదల చేసిన జి.వో.నెం: 97తో పాటు బాక్సైట్‌ కోసం చేసిన అన్ని ఒప్పందాలను వెంటనే రద్దు చేయాలని

డిమాండ్‌ చేశారు.   
    à°¬à°¾à°•à±à°¸à±ˆà°Ÿà±‌ విష ఖనిజం. బాక్సైట్‌ గనుల తవ్వకాల వల్ల గిరిజనుల జీవితాలు, భూములు దెబ్బతినడంతో పాటు నీటివనరులు, పర్యావరణం దెబ్బతింటుందని,

గిరిజనల మనుగడకు విఘాతం కలుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెడచెవిన పెట్టడం దుర్మార్గమన్నారు. తవ్వకాలకు వ్యతిరేకంగా

గిరిజనులు, ప్రజలు పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తున్నా పట్టించుకోకుండా, వారిపై నిర్భందాలు ప్రయోగించి, అక్రమ కేసులు బనాయించి జైళ్ళకు పంపిస్తున్నారన్నరు.

చంద్రబాబు కల్లి బొల్లి మాటలు చెప్పి గిరిజనులను మోసం చేస్తున్నారన్నారు. ఎలాగైనా బాక్సైట్‌ తవ్వి పెట్టుబడిదారులకు లాభాలు చేకూర్చి తమ పబ్బం గడుపుకోవాలని

కేంద్రంలోని బిజెపి, రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వాలు తహతహలాడుతున్నాయని తెలిపారు. ఏజెన్సీలోని గిరిజన ప్రజల జీవితాలను అతలాకుతం చేసే బాక్సైట్‌ తవ్వాలనే

చూస్తే గిరిజన ప్రజల మద్ధతుతో పెద్దఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని సిపిఎం పార్టీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరిస్తోందన్నారు. గత సంవత్సరం అరకులో

జరిగిన అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా బాక్సైట్‌ జివో 97ను రద్దు చేస్తామని చెప్పి నేటికీ సంవత్సరం గడుస్తున్నటికీ రద్దు చేయకపోవడం

దుర్మార్గమన్నారు.  à°šà°‚ద్రబాబు ప్రభుత్వానికి నిజంగా గిరిజనుల పట్ల ప్రేమ వుంటే మీ ప్రభుత్వ హాయంలో విడుదల చేసిన జి.వో.నెం: 97ను, అన్ని బాక్సైట్‌ ఒప్పందాలను

సమూలంగా  à°°à°¦à±à°¦à±à°šà±‡à°¸à±à°¤à±à°¨à±à°¨à°Ÿà±à°²à± ఉత్తర్వులు ఇవ్వాలని సిపిఎం పార్టీ డిమాండ్‌ చేస్తున్నదని తెలియచేసారు. 

 

 

#dns #dnsnews #dns news 
href="https://www.facebook.com/hashtag/dnslive?source=feed_text">#dnslive #dns live #dnsmedia #dns media #vizag #visakhapatnam #CPM #Communist party #visakhapatnam agency #bauxite #mining #bauxite mining #Visakha Agency bauxite 
href="https://www.facebook.com/hashtag/10th?source=feed_text">#Parliament #GO 97

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam