DNS Media | Latest News, Breaking News And Update In Telugu

భాగ్యనగరం లో ఆవులకు కూడా అపార్ట్మెంట్లు ఉన్నాయి

*అభాగ్య గోవుల పాలిట మహా భాగ్యమే భాగ్యనగర్ గో రక్షకులు* 

*(DNS special Report : Sairam CVS, Bureau Chief, Visakhapatnami)*

*విశాఖపట్నం / భాగ్యనగరం, ఫిబ్రవరి 27, 2022 (డిఎన్ఎస్):* పెరుగుతున్న మానవ జనాభా ప్రకారం నివసించేందుకు అపార్ట్మెంట్లు పెరుగుతున్న నేపథ్యంలో విపరీతంగా జరుగుతున్నా అభాగ్య గోవుల హత్యలను ( కబేళా హతకుల ) నుంచి

రక్షించేందుకు గోరక్షకులు చేపట్టిన మహోన్నతమైన ఉద్యమమే. .గో నివాస్ అపార్ట్మెంట్. భాగ్యనగరం లోని కమల గో నివాస్ పై DNS ప్రత్యేక కథనం. 

తెలంగాణ రాష్ట్రంలో గల భాగ్యనగరం లోని లోయర్ ట్యాంకుబండ్ సమీపంలోని కావడి గూడా ప్రాంతంలో ఆరు అంతస్తుల బహుళ భవనం లో వందల సంఖ్యలో  గోవులకు ఆసరా  కల్పించారు. అత్యంత ఖరీదైన ఈ

ప్రాంతంలో కేవలం గోవుల కోసమే దీన్ని నిర్వహించడం మహోన్నతమైన కృషి ఉంది. జైన సంప్రదాయ గో రక్షక్షల భక్తులు ఏటా కోట్లాది గా నిధులు సమకూరుస్తూ వీటి ఆలనా పాలనా చేస్తున్నారు. దీనికి తోడు నగర వాసులు సైతం ప్రతి రోజు     భారీ సంఖ్యలో ఈ గోశాలకు వచ్చి, గోవులకు ఆహారాన్ని అందిస్తున్నారు. వీటికి ఏ విధమైన  ఆహారాన్ని అందించాలో

కూడా నిర్వాహకులు తెలియచేస్తూ  గోవులకు ఎటువంటి  అనారోగ్య ఇబ్బంది రాకుండా కంటికి రెప్పలా కాపాడుతున్నారు. వీటి రక్షణకై వైద్య బృందాలు కూడా తమవంతు సహకారాన్ని అందించడం మరో విశేషం. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే సందర్శకుల పర్యటనా జాబితాలో ఈ గోశాల కూడా ఉండడం అత్యంత ఆదరణీయంగా ఉంది. 

సింహగిరి ప్రాంతంలో సైతం

అభాగ్య గోవుల రక్షణ కోసం ఈ విధమైన బహుళ అంతస్తుల నిర్మాణాలను చేపట్టేందుకు దాతలు, ప్రభుత్వాలు, ఆలయ అధికారులు కూడా తమవంతు సహకారాన్ని అందించగలిగితే వేలాది అభాగ్య గోవులకు ఒక ఆసరా లభిస్తుంది. గోవులకు కూడా ( ఏ జాతి గోవు అయినా) వాటికి కూడా జీవించే హక్కు ఉంటుంది కదా. మనవంతు సహకారం అందించి, వాటిని కూడా కాపాడుకునే మహా యజ్ఞం లో

మనం కూడా భాగస్వాములు అవుదాం.  

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam