DNS Media | Latest News, Breaking News And Update In Telugu

40 నిమిషాల్లో ఈ దోశ తింటే రూ. 71 వేల నగదు బహుమతి మీకే

*(DNS Report : Sairam CVS, Bureau Chief,  Visakhapatnami )*

*విశాఖపట్నం, మార్చి 07, 2022 (డిఎన్ఎస్):* దక్షిణాది ప్రాంతాల్లో బహు ప్రాచుర్యం పొందిన దోశ అంటే ఇష్టపడని వారు ఉండరు. ఉత్తరాది ప్రాంతాలక్లో కూడా ఈ దోశ atyanta ప్రాచుర్యం చెందింది. 

దేశ రాజధాని ఢిల్లీ లోని ఉత్తం నగర్ లో ఉన్న కృష్ణ సాగర్ హోటల్ నిర్వాహకులు సరికొత్త చల్లెన్గ్

ఇస్తున్నారు. దక్షిణాదికి చెందిన ఈ హోటల్ లో 10 అడుగుల దోశ తయారు చేస్తున్నారు. దీనికి పలు రకాల చట్నీలు కూడా ఇస్తున్నారు. దీన్ని ఒకే మనిషి కేవలం 40 నిమిషాల్లోగా తింటే రూ. 71 వేల రూపాయలు బహుమతి ఇస్తున్నట్టు ప్రకటించారు.

ఈ దోశ ఛాలెంజ్ మొదలు పెట్టి నెల రోజులు దాటిందన్నారు. ఇంతవరకూ 26 మంది నుంచి ఫోన్ కాల్స్ వచ్చాయని,

అయితే ఈ బహుమతి ఎవ్వరూ   గెలుచుకోలేదని నిర్వాహకులు శేఖర్ కుమార్ తెలియచేస్తున్నారు   

వారాంతంలో ఒక కుటుంబానికి సరిపడా  5 అడుగులు,  6 అడుగులు, 8 అడుగులు దోషాలు తయారుచేస్తున్నామని, ఎక్కువ మంది ఖాతాదారులను ఆకట్టుకునేందుకు ఈ 10 అడుగుల దోశ ఛాలెంజ్ ను ప్రకటించామని తెలిపారు.  

ఈ దోశ తయారు చేసే పెనం

పొడవు 10 అడుగుల 4 ఇంచీలు ఉంటుందని, ఒక దోశ తయారు చెయ్యడానికి 7 నుంచి 8 నిమిషాల సమయం పడుతుందన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam