DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మే 1 న అయోధ్యలో సాతులూరి స్వామి చే రామాయణ యజ్ఞం

*(DNS Report : Sairam CVS, Bureau Chief,  Visakhapatnam)*

*విశాఖపట్నం, మార్చి 17, 2022 (డిఎన్ఎస్):* అత్యంత పవిత్రమైన శ్రీరామ జన్మస్థలి అయోధ్య నగరంలో  మే 1 వ తేదీ నుంచి 10 వరకూ శ్రీరామాయణ మహా యాగం జరుగనుంది. విశాఖ నగరానికి చెందిన  శ్రీ వేంకటాచార్య వైదిక సంస్థాన్  మరియు శ్రీవైష్ణవ సిద్ధాంత పీఠము సంయుక్త ఆధ్వర్యవంలో ఉత్తర ప్రదేశ్ లోని

అయోధ్యా నగరంలోని హనుమాన్ బాగ్, నయాధార్, వాసుదేవా ఘాట్ వద్ద  24వ శ్రీరామాయణ నవాహ్నిక చతుర్వింశతి కుండాత్మక మహాసామ్రాజ్య పట్టాభిషేకము జరుగనుంది.  మధురవాక్శిఖామణి గా పేరుగాంచిన ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ,  ఉభయ వేదాంత ప్రవర్తక సాతులూరి గోపాలకృష్ణమాచార్య స్వామి చే అత్యద్భుతమైన రామాయణ ప్రవచనం జరుగనుంది.   


యాగం లో వేదవేదాంత ఇతిహాస, పురాణం, దివ్య ప్రబంధ స్తోత్ర పారాయణాలు అనుసంధానం జరుగులనుండి. శ్రీరామాయణం లోని ప్రతి శ్లోకంతోనూ 
24 హోమ కుండాల్లో హవనం జరుగనుంది. సుమారు 250 మంది ఋత్విక్ లు ఈ యాగం లో పాల్గొనున్నారు. ప్రతి రోజు ఉదయం శ్రీరామనామ జపం, ఉదయం 10 గంటల నుంచి 12 వరకూ, తిరిగి సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకూ హవనం, పారాయణాలు

నిర్వహించనున్నారు.  

ఈ యాత్రలో పాల్గొనదలచిన భక్తులు, ఆసక్తి గల ఆధ్యాత్మిక బంధువులు నిర్వాహకులను 99499 05123 నెంబర్ లో సంప్రదించవచ్చు. 

అయోధ్య చేరుకునే మార్గం: విశాఖ నుంచి లక్నో చేరుకోవలెను. లక్నో నుంచి అయోధ్య 140 కిలోమీటర్ల దూరం ఉన్నది. ప్యాసింజర్ రైళ్లు, బస్సులు సదుపాయం కలదు. 
కోలకతా మార్గం నుంచి

వెళ్లే వారు కోలకతా నుంచి డోన్ ఎక్స్ ప్రెస్ లో నేరుగా అయోధ్యకు రైల్లో చేరుకోవచ్చు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam