DNS Media | Latest News, Breaking News And Update In Telugu

నృసింహునికి ఘనంగా డోలోత్సవం, 12 న స్వామి కళ్యాణం

*(DNS Report : Sairam CVS, Bureau Chief,  Visakhapatnam)*

*విశాఖపట్నం, మార్చి 18, 2022 (డిఎన్ఎస్):* ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజల ఆరాధ్య దైవం, భక్తకోటి , ఇలవేల్పు సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి కి డోలోత్సవం వైభవంగా నిర్వహించారు. స్వామి పెళ్లి కుమారుడు గా భక్తులకు దర్శనమిచ్చారు. పాల్గున పౌర్ణమి రోజున ప్రతి ఏటా సంప్రదాయబద్దంగా

నిర్వహించే ఈ వేడుకను శుక్రవారం వైభవంగా జరిపించారు. తెల్లవారుజామునే  సింహాద్రి నాధుడు ను సుప్రభాతసేవతో మేల్కొలిపి ఆరాధన గావించారు. అనంతరం గంగధార నుంచి తీసుకొచ్చిన పవిత్ర జలాలతో అభిషేకం జరిపారు. అనంతరం వేదమంత్రోచ్ఛారణలు మంగళవాయిద్యాల నడుమ స్వామిని కొండ దిగువకు తీసుకువచ్చారు. అక్కడ నుంచి నేరుగా స్వామి తన సోదరి

అయిన శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. 

ఈ సందర్భంగా సోదరి కుమార్తెను ఇచ్చి వివాహం చేయాలనీ సింహాద్రినాధుడు  కోరతారు.
అయితే తొలుత నిరాకరించినప్పటికీ సింహాద్రినాధుడు మహిమాన్వితులు అని తెలుసుకొని తన కుమార్తెను ఇచ్చి వివాహం చేయడానికి అమ్మవారు అంగీకరిస్తారు. పురాణ ఇతిహాస కథనాల ప్రకారం

ఆలయ వర్గాలు అత్యంత వైభవంగా జరిపించారు. తదుపరి అక్కడి నుంచి నేరుగా స్వామినీ పుష్కరిణి సత్రంలోకి తీసుకువెళ్లి ఆశీనులను చేశారు. 

డోలోత్సవం, వసంతోత్సవం, తదితర కార్యక్రమాలు వైభవంగా జరిపించారు. 

లోకానికి వెలుగులు పంచే సింహాద్రి నాధుడు కి వివాహం ఖరారు కావడంతో అర్చక వర్గాలు అంతా ఒకరిపై ఒకరు రంగులు

చల్లుకుని కేరింతలు కొట్టారు. ఉత్సవంలో పాల్గొన్న భక్తులందరికీ కూడా పానకం వడపప్పు, తదితర తీర్థ ప్రసాదాలు పంచిపెట్టారు.

స్వామికి వివాహం ఖరారు కావడంతో సంతోషంగా గ్రామంలోని అన్ని వీదుల్లోను ఆలయ వర్గాలు తిరువీధి నిర్వహించారు. గ్రామ ప్రజలందరు స్వామినీ సాదరముగా స్వాగతించి మంగళహారతులు ఇచ్చారు. అనంతరం మెట్లు

మార్గం ద్వారా సింహాద్రి నాధుని కొండపైకి తీసుకువచ్చారు.

ఈ కార్యక్రమం లో దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ అన్నపూర్ణ,  ఏఈఓ లు శ్రీనివాసరావు రాఘవ కుమార్ , ఆనంద్ కుమార్, అప్పన్న ధర్మ కర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, వైజాగ్ జర్నలిస్టు ఫోరం అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు,

 తదితరులు స్వామిని దర్శించుకుని సేవించి తరించారు..

12 న  స్వామి కళ్యాణం

ఉగాది పర్వదినం సందర్భంగా సింహాద్రి నాధుడు ను పెళ్లి కుమారుడి గా అలంకరణ గావిస్తారు.. ఆ రోజునుంచి పెళ్ళి పనులు ప్రారంభిస్తారు. అదే రోజు స్వామి పాదాలు ను సూర్య కిరణాలు తాకుతాయి. ఏప్రిల్, 12న స్వామి కల్యాణం కన్నుల పండువగా

జరిపిస్తారు

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam