DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జీయర్ స్వామిజి మా జీవితాల్లో వెలుగునింపారు :ఆదివాసీలు 

తప్పుగా మాట్లాడవద్దు సీతక్క కు అల్లంపల్లి సర్పంచ్ సూచన

స్వామిజి ఫోటోకు క్షీరాభిషేకం, జయహోలతో హోరెత్తిన ఏజెన్సీ 

*(DNS Report : Sairam CVS, Bureau Chief,  Visakhapatnam)*

*విశాఖపట్నం, మార్చి 19, 2022 (డిఎన్ఎస్):* వరంగల్ సమీపంలోని అల్లంపల్లి పరిసర గ్రామాల్లో గురుకులాలు పెట్టి వందలాది మంది ఆదివాసీ కుటుంబాల్లో

వెలుగులు నింపిన మహనీయులు చిన్న జీయర్ స్వామిజి వారేనని, అలాంటి స్వామి గురించి తప్పుగా మాట్లాడవద్దు అని ఎమ్మెల్యే సీతక్క కు అల్లంపల్లి గ్రామసర్పంచ్ సూచన చేసారు. ఎవరో ఎడిట్ చేసిన వీడియో చూసి ఒక ఎమ్మెల్యే గా ఉన్న వ్యక్తి  స్వామిజి పట్ల అనుచిత వ్యాఖ్యలు చెయ్యడం సరికాదన్నారు. 
ఆదివాసీలందరి  తరపున ఒకరిద్దరు

వకాల్తా పుచ్చుకోనక్కరలేదన్నారు. ఏదేని అభ్యంతరాలు ఉంటె నేరుగా జీయర్ స్వామిజి ని కలిసి గౌరవప్రదంగా తెలుసుకోవాలన్నారు. 
ఇటీవల కాలం వరకూ తమ ప్రాంతాల్లో ఎన్నో సమస్యలు ఉన్నాయని, ప్రభుత్వం నుంచి ఎటువంటి పరిష్కారాలు లేవని, వాటి కోసం పోరాటం చెయ్యాలని డిమాండ్ చేశారు. మా గ్రామాల్లో 500 మంది పైగా  పిల్లలకు మంచి చదువు,

ఉపాధి కల్గించాలి అనే మంచి సంకల్పంతో జీయర్ స్వామి ఎల్లంపల్లి, కటారివారిపాలెం, బీర్సాయిపేట్ ల్లో గురుకులాలను నెలకొల్పి, ఉచిత విద్య, వసతి, ఆహారం అన్నీ అందించడమే కాక, వారికి మంచి సంస్కారాన్ని కూడా నేర్పిస్తున్నారన్నారు. 
ఇన్నాళ్లు మా గ్రామాల్లో సమస్యలను పట్టించుకోకుండా. . త్వరలో ఎన్నికలు వస్తున్నాయని, ప్రజలను

రెచ్చగొట్టే కార్యక్రమాలను మానుకోవాలని సూచించారు. అంతకు ముందు అల్లంపల్లి గ్రామ వీధుల్లో జీయర్ స్వామి చిత్రపటం తో ఆదివాసీ ప్రజలు భారీ ర్యాలీ నిర్వహించి, స్వామీజీకి సంఘీభావంగా నినాదాలు చేశారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam