DNS Media | Latest News, Breaking News And Update In Telugu

శిష్యుని రాక కు బ్రేక్ వేసేయత్నంలో గురువుని టార్గెట్ చేశారా?

*తెలంగాణలో ఒక నేతపై  బీజేపీ దృష్టి? అడ్డుకునే దిశగా ప్రత్యర్థులు* 

*(DNS Report : Sairam CVS, Bureau Chief,  Visakhapatnam)*

*విశాఖపట్నం, మార్చి 20, 2022 (డిఎన్ఎస్):*  *తెలంగాణ లో అధికార పీఠం పై కూర్చునేందుకు భారతీయ జనతా పార్టీ చేస్తున్న పటిష్ట ప్రణాళికల్లో ఒకటి శక్తివంతులైన వ్యక్తులను పార్టీలోకి అహ్వానించడం. దానిలో భాగమే ఒక

శక్తివంతమైన వ్యక్తిని బీజేపీ లోకి అహ్వానించినట్టు తెలుస్తోంది. త్వరలోనే వీరు కాషాయ తీర్ధం పుచ్చుకుంటారని వార్తలు వినిపిస్తున్నాయి. వీరిని అడ్డుకునేందుకు ఇతర రాజకీయ పార్టీలు చెయ్యకూడని ప్రయత్నాలకు ఒడికట్టినట్టు తెలుస్తోంది.* 

*రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ఆర్ధిక, అంగ బలం గల్గిన వ్యక్తుల్లో

ఒకరుగా ఉన్న వీరు  తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్ర శేఖర్ రావు తో సన్నిహితంగా ఉండే వారు కావడంతో వీరు బీజేపీ లో . . రాష్ట్రంలో సమీకరణాలు మారె అవకాశం కూడా ఉంది. వీరికి కేసీఆర్ తో బంధుత్వం కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే వీరు రాజకీయాలకు కొత్త కావడం ప్రత్యర్థులకు కలిసి వచ్చే అంశం. అదే విధంగా ఇలాంటి వారు బీజేపీ వంటి

పార్టీల్లో ఉంటె. . తమ పరిస్థితి మరింత గడ్డుగా మారె అవకాశం ఉంటుందేమో అనే అనుమానంతో కాంగ్రెస్ పార్టీలో కూడా అంతర్మధనం మొదలైంది.* 

*భారీ ప్రాజెక్ట్ నిర్మాణమే వొణుకు పుట్టించిందా?*

*ఇటీవలే వీరి హయాంలోనే భాగ్యనగరం లో భారీ నిర్మాణం చేపట్టడం జరిగింది. దానితో వీరి ప్రతిష్ఠా దేశవిదేశాల్లో

మారుమ్రోగిపోయింది..* 

*వీటిని ప్రారంభించేందుకు సాక్షాత్తు దేశాధినేతలు ప్రత్యక్షంగా పాల్గొనడంతో తెలంగాణ లోని రాజకీయ పార్టీలకు వొణుకు పుట్టింది అనడం అతిశయోక్తి కాదు.* 

*దీంతో వీరి పేరు దేశం, విదేశాల్లో మరింత బహుళ ప్రచారం లోకి రావడం కూడా బీజేపీ కి బాగా కలిసి వచ్చే అంశం. రాష్ట్రంలో అత్యంత

శక్తివంతమైన సంస్థలు, జాతీయ అంతర్జాతీయ సంస్థలతో మంచి సంబంధాలు కలిగి ఉండడం, పైగా నెమ్మదస్తులు అనే ముద్ర కూడా వీరి సొంతం. ఇవన్నీ బీజేపీ కి బాగా కల్సి వచ్చే అంశాలు.* 

*ప్రధాని ఈ బృందానికి రెండు పర్యాయాలు అప్పోయింట్మెంట్ ఇవ్వడానికి వీరు పార్టీలోకి ఆహ్వానించేందుకు అనే ప్రచారం కూడా రాజాకీయ పార్టీ ల క్యాడర్ లో

జరుగుతోంది.*    

*వీరిని అడ్డుకునేందుకు వీరికి ఉన్న బలహీనతలు, ఉన్న ఇతర అవకాశాలనూ ప్రత్యర్థులు విస్తృతంగా పరిశీలన చేయడం తో వారికి కనిపించిన అంశం ఒక్కటే. వీరి గురువే వీరి ప్రధాన బలం. . . బలహీనత కూడాను.* 

*దీనితో ప్రత్యర్థులు వీరి ఆచార్యులను లక్ష్యంగా చేసుకుని. .. అవాస్తవాలను వివిధ సోల్డ్ మీడియాల

ద్వారా దుష్ప్రచారం చేస్తూ రచ్చ చేయడం మొదలు పెట్టారు. ఇది గత నాలుగు నెలలుగా జరుగుతున్న హైందవ ద్రోహం.* 

*కలలో కూడా ఇతరులకు హాని చెయ్యాలి అనే ఆలోచన కూడా రాని ఆ మహానీయులను అవాస్తవ అంశాలతో ముడిపెట్టి, సుమారు 20 ఏళ్ళ క్రితం ఎప్పుడో  వారి శిష్యులకు మాత్రమే అంతర్గతంగా చెప్పిన ఉపదేశాలను వీరు రోడ్డు కెక్కించి

తద్వారా శిష్యుణ్ణి అడ్డుకోవచ్చు అనే కుట్రతో వ్యవహరిస్తున్నట్టు తో పలువురు భావిస్తున్నారు.*

*ఆచార్యులపై జరుగుతున్న ఈ దుష్ప్రచారాన్ని భక్తులు గానీ, హిందూ సమాజం కానీ నమ్మే అవకాశం లేకపోవడంతో ప్రత్యర్ధులు వేరే మార్గాలను వెతుక్కోవడంలో పడ్డట్టు తెలుస్తోంది.* 

*దీని పై స్వామిజి భక్తులు, ప్రధానంగా

ఆదివాసీ గ్రామాల్లో వీరు స్థాపించిన గురుకుల పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, తండాల పెద్దలు స్వామీజీకి సంఘీభావం ప్రకటించడం గమనార్హం.* 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam