DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జగ్గయ్యపేట లో ఏలూరు రేంజ్ డిఐజి ఆకస్మిక తనిఖీ 

*(DNS Report : P Raja, Bureau Chief, Amaravati)*

*అమరావతి, మార్చి 22, 2022 (డిఎన్ఎస్):* వివిధ సమస్యలపై పోలీస్ స్టేషన్ కు వచ్చే సందర్శకుల పట్ల గౌరవ భావంతో మెలగాలని ఏలూరు రేంజ్ డిఐజి కె వి మోహన్ రావు సూచించారు. ఆకస్మిక తనిఖీల్లో భాగంగా మంగళవారం ఆయన కృష్ణ జిల్లా లోని జగ్గయ్య పేట పోలీస్ స్టేషన్ లో తనిఖీలు నిర్వహించారు.  పోలీస్ స్టేషన్ పరిసర

ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించి, ఎల్లప్పుడు పోలీస్ స్టేషన్ ను పరిశుభ్రంగా  ఉంచుకోవాలని తెలిపారు.  పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న సిబ్బందితో సమావేశం అయ్యి వారు పట్టణంలో ఏయే ప్రాంతాల్లో విధులు నిర్వహించేది, అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నది అడిగి తెలుసుకున్నారు.

సిబ్బంది ఎటువంటి ఇబ్బందులు

ఎదుర్కొంటున్నా వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని అన్నారు.  అనంతరం పోలీస్ స్టేషన్ లో నిర్వహిస్తున్న అన్ని రికార్డులు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. 
నందిగామ డిఎస్పీ నాగేశ్వర్ రెడ్డి, జగ్గయ్యపేట ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ తో సర్కిల్ పరిధిలో నమోదవుతున్న కేసుల వివరాలను గూర్చి అడిగి తెలుసుకున్నారు.

అంతేకాకుండా ప్రతి రికార్డును  నిర్లక్ష్యం వహించకుండా నిర్వహించాలని, సిబ్బంది యొక్క పనితీరుపై ఎల్లవేళల ప్రత్యక్ష పర్యవేక్షణ ఉండాలని సూచించారు.

వివిధ సమస్యలతో పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితుల పట్ల మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, మహిళలు, చిన్నారుల ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి సారించాలని, వారి సమస్య విని

చట్ట పరిధిలో పరిష్కారం అయ్యేలా కృషి చేయాలని, ఫిర్యాదుల పై న్యాయం అందించడంలో జాప్యం వద్దని తెలిపారు. దిశా యాప్ ద్వారా మహిళలకు అండగా పోలీస్ శాఖ ఉందని, ఏ సమస్య అయినా ధైర్యంగా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam