DNS Media | Latest News, Breaking News And Update In Telugu

స్వామిజి పై విమర్శలు కాదు, ఆలయ, అర్చకుల కోసం పోరాడండి

*ఓ. హిందూ ఉద్ధారకుల్లారా ఆలయాల కోసం ఉద్యమించండి*

*ఆలయంలోనే అర్చకుని హత్య జరిగితే నోరెత్తరేం?: హిందూ సంఘాలు* 

*(DNS Report : Sairam CVS, Bureau Chief,  Visakhapatnam)*

*విశాఖపట్నం, మార్చి 21, 2022 (డిఎన్ఎస్):* గత కొన్ని రోజులుగా హిందూ సమాజాన్ని తామే ఉద్ధరిస్తున్నట్టు గా వ్యవహరించిన బంగారయ్య శర్మ, సరికొత్త భగవతి, నిర్మాత

అశ్వని దత్, యాంకర్ వెంకట కృష్ణ లు ప్రస్తుతం తమ భాద్యతలను పూర్తిగా విస్మరించి పూర్తిగా విశ్రాంతి తీసుకుంటున్నారా అని ధార్మిక సంప్రదాయవాదులు ప్రశ్నిస్తున్నారు.  

గత 20 ఏళ్ళ క్రితం ఒక స్వామిజి మాట్లాడిన వీడియో లోని కొంత భాగాన్ని ఎడిట్ చేసి, దాన్ని రచ్చ చేస్తూ వీళ్ళందరూ ఒక టీవీ చర్చల్లో నానా రచ్చ చేసిన

ఘటనలు అందరూ గమనించారు. ఈ చర్చల ద్వారా మొత్తం హిందూ సమాజాన్ని తామే నిలబెడుతున్నట్టుగా సొంత ప్రచారం చేసుకుని, ఆ స్వామిజి పై సభ్య సమాజం సిగ్గు పడే విధంగా నానా దుర్భాషలూ ప్రయోగించి, అవాకులు, చెవాకులు ప్రేలుతుంటే. . అడ్డుకోవాల్సిన టీవీ యాంకర్ అవును అవును అంటూ సమర్ధించడాన్ని యావత్ హిందూ సమాజం

మండిపడుతోంది. 

అయితే సదరు హిందూ సమాజ ఉద్ధారకులు గత రెండు రోజుల నుంచి పూర్తిగా నిద్రమత్తులో ఉన్నట్టుగా ఉంది. సోమవారం రాత్రి పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు మండలం లోని తాడిమళ్ల గ్రామంలోని ఓ శివాలయంలో పూజారిగా పనిచేస్తున్న కొత్తలంక శివనాగేశ్వర్‌ (55 ఏళ్ళు) ను అత్యంత కిరాతకంగా హత్య చేస్తే. . కనీసం వీళ్ళు

నోరెత్తక పోవడం పై హిందూ సమాజం మండిపడుతోంది. సదరు టీవీ యాంకర్ అసలు తనకేమి తెలియదు అన్నట్టుగా వ్యవహరించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. 

మొన్న డిబేట్ లో మొత్తం హిందూ సమాజం తరపున వకాల్తా పుచ్చుకున్న అశ్వని దత్, బంగారయ్య శర్మ, సరికొత్త భగవతి అసలు పత్తాలేకుండా పోవడం గమనార్హం. గుడిలో పూజల్లో ఉన్న పూజారిని ఆ

గుళ్లోనే హత్య చేస్తే. . వీళ్లకు పట్టింపు లేకపోవడం ఏంటని మండిపడుతున్నారు. 

గత దశాబ్ద కాలంలో ఆంధ్ర ప్రదేశ్ లో వందలాది హిందూ దేవాలయాలు కూల్చినప్పుడు, రామతీర్ధం లో రాముని విగ్రహాన్ని ధ్వాంసం చేసినప్పుడు, వందలాది మంది హిందువులపై భౌతిక దాడులు జరిగినప్పుడు ఈ నకిలీ హిందూ ఉద్ధారకులు ఎప్పుడు నోరెత్తిన

పాపాన పోలేదు.  

ఇలాంటి అవకాశవాదులు హిందూ ధర్మ ప్రచారం కోసమే జీవితాన్ని త్యాగం చేసిన ఒక పీఠాధిపతిపై అవాకులు, చెవాకులు వ్యాఖ్యానిస్తూ దుర్భాషలాడినందుకు తగిన ఫలితం అనుభవించే రోజు దగ్గరలోనే ఉందని  ధార్మిక సంప్రదాయవాదులు మండిపడుతున్నారు.

వీళ్ళు ఎవరి ప్రోద్బలంతోనే కొందరితో లాలూచీ పడి, ప్రపంచ

దేశాలు మెచ్చిన ఒక పీఠాధిపతి పై అవాకులు చెవాకులు వ్యాఖ్యానించడం పై తక్షణం బేషరతు క్షమాపణ చెప్పాలని ధార్మిక సంప్రదాయవాదులు డిమాండ్ చేస్తున్నారు. 

ముందుగా మీరు ఈ హిందూ సమాజానికి చేసిన మేలు ఏంటో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. 

ఇన్ని దశాబ్దాలుగా ఎక్కడున్నారో తెలియని ఇలాంటి  నకిలీల తెరవెనుక

లీలలను త్వరలోనే సోషల్ మీడియా వేదికపై దర్శనం కానున్నట్టు తెలుస్తోంది. వీళ్ళ అండ చూసుకుని అసలు హిందూ సమాజంతో ఏమాత్రం అనుబంధం లేనివాళ్లు సైతం అసంబద్ధ వ్యాఖ్యలు చేయడం ఒక కుట్రలో భాగమే అని తెలుస్తోంది. ఈ కుట్రలు త్వరలోనే  ఛేదించబడి, ఈ మొత్తం దురాలోచన కు కర్త, కర్మ, క్రియ కు కారణమైన వారిని హిందూ సమాజము ముందు దోషిగా

నిలబెట్టడం త్వరలోనే జరుగుతుంది అనే ఆశాభావం లో హిందూ ధార్మిక సంఘాలున్నాయి.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam