DNS Media | Latest News, Breaking News And Update In Telugu

హైందవ ధర్మ పరిరక్షణకే విశాఖ శారదా పీఠం కృషి 

*(DNS Report : Sairam CVS, Bureau Chief,  Visakhapatnam)*

*విశాఖపట్నం, మార్చి 23, 2022 (డిఎన్ఎస్):* సనాతన హైందవ ధర్మ పరిరక్షణ కోసమే v విశాఖ శ్రీ శారదా పీఠం నిరంతర శ్రమిస్తోందని, విశాఖ శ్రీ శారద పీఠాధిపతి స్వరూపానందేంద్ర‌ సరస్వతి తెలియచేసారు. బుధవారం విశాఖలో టిటిడి నిర్మించిన శ్రీవారి దేవాలయ మహాకుంభాభిషేకం లో పాల్గొన్న ఆయన అనుగ్రహ భాషణం

చేసారు. ఇటీవల కాలంలో హైందవ సంప్రదాయాలపై  పలువురు విపరీత వ్యాఖ్యానాలు చేస్తున్నారని , అయితే అత్యంత సామాన్యులకు సైతం భగవంతునికి చేరువ చేసేందుకు శారదా పీఠం కన్యాకుమారి నుంచి కాశ్మీరం వరకూ  అవిశ్రాంతంగా పర్యటించి ధర్మ సంస్థాపనకై నడుం బిగించిందన్నారు.   

లోకంలోని సమస్త జీవులు సుభిక్షంగా ఉండాలని,

తిరుమల శ్రీనివాసుని అనుగ్రహంతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం బాగుండాలని, ప్రత్యేకంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో అత్యున్నత స్థాయిలో అభివృద్ధి చెందాలి అని కోరుకున్నామన్నారు. 

శారదా పీఠం మార్గదర్శకత్వం లో గిరిజన ప్రాంతాల్లోని భక్తులను తిరుమల శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు తీసుకువెళ్లిన సందర్భాలు ఉన్నాయి.

 ఋషికేశ్, హరిద్వార్ వంటి పుణ్యక్షేత్రాల్లో సైతం ఎన్నో ధార్మిక కార్యక్రమాలను ఎన్నో నిర్వహించింది విశాఖ శ్రీ శారదా పీఠం.  

ముఖ్యమంత్రి  వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కోరిక మేరకు, టిటిడి బృందం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయం విశాఖలో నిర్మించినట్లు తెలిపారు. వైఖానస ఆగమానుసారం శ్రీవారి ఆలయ నిర్మాణం

జరిగిందన్నారు. ఆలయంలో మూలమూర్తి సాక్షాత్తు తిరుమల వెంకన్న తిరిగి వచ్చాడా అన్నంత‌ అద్భుతంగా ఉందన్నారు. 

వేదాలు ఆగమాలు దేవాలయాల ప్రాముఖ్యతను తెలియజేస్తున్నాయని చెప్పారు.  ధ్వజస్తంభం సమస్త జీవులకు, ఆలయానికి వెన్నుముక్క వంటిద‌న్నారు. ముఖమండపం స్థూలశరీరం, అర్ధ మండపం సూక్ష్మ శరీరం, గర్భాలయం హృదయం

వంటిదన్నారు. గర్భాలయంలోని స్వామివారిని దర్శిస్తే సమస్త పాపాలు తొలగి, కోరిన కోర్కెలు నెరవేరుతాయని వివరించారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam