DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆశ్రితులకు అభయహస్తం అందించే వారిజ హయగ్రీవుడు 

*వారిజలో నెలకొన్న స్వామి భక్తుల పాలిట కల్పతరువు*

*(DNS Report : Sairam CVS, Bureau Chief, Visakhapatnami)*

*విశాఖపట్నం, మార్చి 23, 2022 (డిఎన్ఎస్):* విద్యార్థి దశలో ప్రతి ఒక్కరి కల అత్యున్నత విద్య అభ్యసించాలని, ఉన్నత స్థితి కి చేరుకోవాలని. అలాంటి విద్యార్థుల కలలను నెరవేరుస్తు తనను ఆశ్రయించిన వారందరికీ అభయ హస్తాన్ని అందించే

స్వామి వారిజ లోని శ్రీ లక్ష్మి హయగ్రీవ పెరుమాళ్. 

విశాఖ నగరంలోని సాగర తీరంలో ప్రముఖ  ఆధ్యాత్మికవేత్త, అపర రామానుజులు,  త్రిదండి చిన్న జీయర్ స్వామి వారిచే నిర్వహించబడుతున్న వేదపాఠశాలే వారిజ ఆశ్రమం. కేవలం వేద విద్య మాత్రమే కాకుండా సామాన్య లౌకిక  విద్య అభ్యసించే వారికీ కూడా ఉన్నత విద్య లభించాలని అనే

సంకల్పంతో ఈ ఆశ్రమంలోనే శ్రీ సీతారామ మందిరం నిర్మించి, అదే  ప్రాంగణంలో శ్రీ లక్ష్మి హయగ్రీవ స్వామిని ప్రతిష్ట చేశారు. ఈ ప్రాంగణంలో నిత్యం వేదపఠనం జరుగుతూ ఉంటుంది. గోశాల ఉండడంతో గో ధూళి తో కూడా ఏ ప్రాంగణం  పవిత్రం అవుతోంది. అదే ప్రాంగణంలో యాగశాలలో మంత్రం హవనం జరుగుతోంది. 

వేదఘోష, గోధూళి, యాగశాల లో మంత్రం

హవనం ఈ మూడింటిలో ఏ ఒక్కటి ఉన్న ఆ ప్రదేశం ఎంతో మంగళమయమవుతుంది అని వేదవాక్కు. అలాంటిది ఈ మూడు ఒకే ప్రాంగణం లో ఉండడం మహోన్నతమైనది. 

అలాంటి ప్రాంగణంలో ఉన్న లక్ష్మి హయగ్రీవుడు తనను ఆశ్రయించిన వారికీ అభయాన్ని  అందిస్తున్నాడు. 

ఆలయంలో ఆరాధనలు చేసే అర్చకులు, నిర్వాహక వేద అధ్యాపకులు,

త్రిసంధ్యల్లోనూ సంధ్యావందనం ఆచరించి, వేద పఠనం చేసే వేద విద్యార్థులు, ఆశ్రమ వాసులు ఎంతో శ్రద్దగా, భక్తితో కార్యాచరణ చేస్తున్నారు. తద్వారా ఆశ్రమ వాతావరణం ఎంతో పవిత్రతను సంతరించుకుంది. 

సాధారణ భక్తులకు సైతం ఈ వైభవం అందించాలి అనే సంకల్పంతో ఆశ్రమ నిర్వాహకులు ఆలయంలో ప్రత్యేక ఆరాధన కార్యక్రమాలను

నిర్వహిస్తున్నారు. 

1 . ప్రతి ఆదివారం ఉదయం 8 గంటలకు విద్యార్థులకు విద్యాప్రాప్తి లభించాలి అనే సంకల్పంతో ఉచితంగానే హయగ్రీవ పూజలు విద్యార్ధులతోనే చేయిస్తున్నారు. 

2 . జన్మదినం, వివాహ వార్షికోత్సవం, తదితర అన్ని శుభ సందర్భాల్లో భక్తుల శ్రేయస్సుకు విశేష పూజలు చేయడం, వేద పండితులచే వేదాశీర్వచనం

చేయించడం ప్రధానమైనది. 

3 . భక్తులచే గో పూజ చేయించడం, తద్వారా గోవు ప్రాధాన్యతను  తెలియచేసి, గో ఉత్పత్తులను వినియోగించేలా అలవగాహన కల్పించడం కూడా ఒకటి.    
 
4 . ప్రతి రోజు ఆరాధనలో భక్తుల గోత్ర నామాలతో అర్చన జరిపించడం. 

5 . ప్రతి గురువారం  సహస్ర నామార్చన, 

6 . ప్రతి శుక్రవారం సహస్ర

కుంకుమార్చన

7 . ప్రతి పౌర్ణమికి స్వామికి పంచామృతాభిషేకం నిర్వహించడం జరుగుతుంది. ఇదే ప్రాంగణం లో స్వామికి నేరుగా భక్తులే అభిషేకం చేసుకునే అవకాశం ఉంది. 

8 . విశేష హయగ్రీవ హోమం జరుగుటఁది.  

ప్రతి రోజు స్వామి కి బాలభోగం, రాజభోగం నివేదన అనంతరం భక్తులను తదీయారాధన ( ప్రసాద వితరణ)

అందిస్తున్నారు. 

అత్యంత ప్రశాంతమైన ఈ వాతావరణంలో జ్ఞాన నేత్రులైన విద్యార్థుల కోసం నేత్ర విద్యాలయ ను కూడా స్వామిజి నిర్వహిస్తున్నారు. వీరు విద్యలోనూ ఉన్నత ఫలితాలు  సాధించడమే కాకుండా అంతర్జాతీయ క్రీడా పోటీల్లో భారత్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న  క్రీడాకారులు కూడా ఉన్నారు. 

ఈ ఆలయంలో జరిగే

కార్యకమాలను తెలుసుకునేందుకు, పాల్గొనేందుకు ఆశ్రమం ప్రతినిధి ముడుంబై శ్రీకాంత్ స్వామి ని 92472 17901, 7989762149 ఫోన్ నెంబర్లలో సంప్రదించవచ్చన్నారు.  

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam