DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విశాఖ రైల్వే జోన్ పై బీజేపీ ఇచ్చిన మాట నిలుపుకుంది

*కేంద్ర బడ్జెట్ లో రూ. 2553 కోట్ల నిధులు కేటాయింపులు* 
 
*బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సుహాసిని ఆనంద్ హర్షం*
 
*(DNS Report : Sairam CVS, Bureau Chief,  Visakhapatnam)*

*విశాఖపట్నం, మార్చి 26, 2022 (డిఎన్ఎస్):* గత ఎన్నికల్లో ఉత్తరాంధ్ర ప్రజలకు భారతీయ జనతా పార్టీ  ఇచ్చిన హామీ ప్రకారం విశాఖపట్నం కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ ను

ఆచరణలోకి తీసుకు వచ్చింది అని ఆంధ్ర ప్రదేశ్ బీజేపీ అధికార ప్రతినిధి సుహాసిని ఆనంద్ హర్షం వ్యక్తం చేసారు. ఈ సందర్భంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోమ్ మంత్రి అమిత్ షా, ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్, కేంద్ర రైల్వే మంత్రి వైష్ణవ్, బీజేపీ అధ్యక్షులు జెపి నడ్డాలకు ఆమె ధన్యవాదములు తెలియచేసారు. 2019 ఎన్నికల ప్రచారం

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విశాఖపట్నం లో జరిగిన బహిరంగ సభలోనే ఉత్తరాంధ్ర ప్రజలకు ప్రత్యేక రైల్వే జోన్ హామీ ఇచ్చిన విషయాన్నీ గుర్తు చేసారు. గత పాలకులు ఆంధ్ర ప్రదేశ్ ను నిర్లక్ష్యం చేస్తూ విభజన ప్రక్రియ ద్వారా ఎన్ని సమస్యలు సృష్టించారో అందరికి తెలిసిందేనన్నారు. 

శనివారం లోక్ సభలో రైల్వే మంత్రి వైష్ణవ్

ఈ కేంద్రం ఏర్పాటు పై చేసిన ప్రకటన పట్ల ఆమె హర్షం వ్యక్తం చేసారు. ఇటీవల కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రస్తుత ఆర్ధిక బడ్జెట్ లో రూ. 2553 కోట్ల నిధులను కేటాయించడం ద్వారా ఈ రైల్వే జోన్ ను బీజేపీ ఎంత ప్రాధాన్యత కల్పించిందో తెలుస్తోందన్నారు.   

మూడున్నర దశాబ్దాల కాలంగా ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలు

ఎదురు చూస్తున్న విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ఇస్తాం అంటూ గత ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ చేసిన హామీని నెరవేర్చిందని ఆంధ్ర ప్రదేశ్ బీజేపీ అధికార ప్రతినిధి సుహాసిని ఆనంద్ హర్షం వ్యక్తం చేసారు. 
అయితే కొన్ని సాంకేతిక పరమైన ఇబ్బందులు కారణంగానే ఈ ప్రకటన కొంత ఆలస్యమైందన్నారు. గత ప్రభుత్వాలు ఉత్తరాంధ్ర కు

చేసిన నిర్లక్ష్యం కారణంగానే విశాఖపట్నం రైల్వే డివిజన్ నాటి నుంచి నేటి వరకూ ఇబ్బంది పడిందన్నారు. దషడ్బాల ఉత్తరాంధ్ర ప్రజల కల నెరవేర్చినందుకు ఆనందం వ్యక్తం చేసారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam